హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. రంజాన్ మాసం కావడంతో నాన్గర్హార్ రాష్ట్ర రాజధాని జలాలాబాద్లోని స్టేడియంలో క్రికెట్ టోర్నీని నిర్వహించారు. ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి స్థానిక జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు. మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అదే సమయంలో ఈ ప్రమాదంలో 45 మంది వరకు గాయపడ్డారని, ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికత్సి పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బాంబు పేలుళ్లను ఆ రాష్ట్ర గవర్నర్ ఖండించడంతో పాటు మృతులకు సంతాపం తెలిపారు. ఈ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి ఏ తాలిబన్ గ్రూప్ బాధ్యత తీసుకోలేదు.
ఈ ఘటనపై ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని మాట్లాడుతూ 'జలాలాబాద్ మైదానంలో మూడు బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు బాధ్యులు ఎవరో ఇంకా తెలియరాలేదు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణం. దాడులకు పాల్పడిన వారు మానవత్వానికి శత్రువులు' అని పేర్కొన్నారు.
I strongly condemn the attacks last night during a local cricket tournament in Jalalabad, Nangarhar. Cricket has been a source of happiness & pride for all Afghans, it has played a key role in bringing peace and uniting people. These attacks are against peace, unity and humanity. pic.twitter.com/Wb43zBl6hQ
— Atif Mashal (@MashalAtif) May 19, 2018