కోహ్లీ UAE రాయల్స్ జట్టులో ఆడనున్న రోజర్ ఫెదరర్
దుయాబ్: స్విస్ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో ఆడనున్నాడు. అవును నిజమే. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ UAE Royals ప్రాంఛైజీకి సహ యజమానిగా ఉన్నారు.
UAE Royals ఫ్రాంచైజీ గురువారం తన అధికారిక ట్విట్టర్ పేజీలో విరాట్ కోహ్లీ సహా యజమానిగా ఉన్నారంటూ ట్వీట్ చేసింది. మహేష్ భూపతి స్థాపించిన ఐపీటీఎల్ తొలి సీజన్ గతేడాది ఇండియాలో మ్యాచ్లను నిర్వహించింది. స్విట్జర్లాండ్కు చెందిన రోజర్ ఫెదరర్ గతేడాది ఇండియన్ ఏస్ తరుపున ఆడిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది డిసెంబర్ 2న ప్రారంభం కానున్న రెండో సీజన్లో 20 వరకు జరగనుంది. ఈ టోర్నీ భారత్తో పాటు మిగతా ఐదు దేశాలలో జరగనుంది. ఈ ఏడాది ఇండియన్ ఏస్ జట్టులో లియాండర్ పేస్ ఆడనున్నాడు. ఇటీవలే శ్రీలంకపై 2-1 తేడాతో చారిత్రక టెస్టు సిరిస్ విజయం సాధించిన కోహ్లీ ఇండియన్ సూపర్ లీగ్లో కూడా ఎఫ్సీ గోవా ఫ్రాంచైజీ సహా యజమానిగా ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications