నిదాహస్ ట్రోఫీ ట్రోఫియే కారణం
అయితే, ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్ ట్రోఫీ ట్రోఫియేనని విజయ్ శంకర్ చెప్పుకొచ్చాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం విజయ్ శంకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచకప్ బెర్త్ గురించి ఆలోచించడం లేదని, కేవలం తన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టానని చెప్పాడు.
ప్రపంచకప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదు
"నేను గతంలోనూ చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను.. ప్రపంచకప్ సెలక్షన్ గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నాకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. నేను కేవలం జట్టు గెలుపుకు తన నుంచి ఇవ్వాల్సిన ప్రదర్శనపై మాత్రమే దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే.. నిదాహస్ ట్రోఫీ నాకు ఎన్నో విషయాలను నేర్పించింది" అని అన్నాడు.
|
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసింది
"ఆ టోర్నీ తర్వాతే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలిసింది. అన్నివేళలో ప్రశాంతంగా ఉండాలనే తత్వం బోధపడింది. తాజా మ్యాచ్లో ఏ సమయంలోనైనా బౌలింగ్ చేయాడనికి మానసికంగా సిద్ధమయ్యాను. 44 ఓవర్ల తర్వాత ఎప్పుడైనా బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలని, అది చివరి ఓవరైనా చాలెంజ్కు సిద్ధంగా ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను" అని విజయ్ శంకర్ అన్నాడు.
ఆఖరి ఓవర్లో బుమ్రా మెళుకువలు
"ఆఖరి ఓవర్లో బుమ్రా చెప్పిన మెళుకువలు ఎంతగానో కలిసొచ్చాయి. క్లబ్ క్రికెట్లో తప్పా నేనెప్పుడూ చివరి ఓవర్ బౌలింగ్ చేయలేదు. చివరి ఓవర్లో రెండు వికెట్లు దక్కడంతో పొంగిపోలేదు. కేవలం ఆ మూమెంట్ను ఆస్వాదించాను అంతే. ఇక, రనౌట్ కావడం అనేది క్రికెట్లో సాధారణ విషయం. ఆ సమయంలో మళ్లీ క్రీజులోకి వేళ్లే అవకాశం లేదు. దీనిని నేను దురదృష్టం అనుకోను" అని అన్నాడు.