ఆటగాళ్లు అలసటతో ఆందోళన
"రాబోయే రోజుల్లో చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. ఎంత మంది క్రికెటర్లు 15, 16 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు? ఆటగాళ్లు అలసటతో ఆందోళన చెందుతున్నారని నేను అనుకోవడం లేదు. తాజాగా ఉండటానికి అవసరమైన మార్గాన్ని కనుక్కోండి. మ్యాచ్లను వదిలేయడం సమస్యకు పరిష్కారం కాదు" అని అన్నాడు.
క్రికెట్ కెరీర్ చాలా చిన్నది
"ఎందుకంటే క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. అంతర్జాతీయ స్థాయి, ఐపీఎల్లో మళ్లీ మళ్లీ అవకాశాలు రావు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అందుకే అందుబాటులో ఉన్న ప్రతి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నించాలి" అని గంగూలీ చెప్పాడు. మరోవైపు తమ పేసర్ బుమ్రా.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే ఐపీఎల్ ఆడటమే ఉత్తమమని ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే సూచించాడు.
శరీర స్థితిని బట్టి మ్యాచ్లు ఆడాలి
అయితే, ఆటగాళ్లు ఎవరికి వారు తమ శరీర స్థితిని బట్టి మ్యాచ్లు ఆడాలని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. "గత నాలుగేళ్లుగా దేశ విదేశాల్లో తిరుగుతూనే ఉన్నాం. ఇటీవల విరామం లేకుండా మ్యాచ్లు ఆడాం. అయితే, ఐపీఎల్లో ఎలా వ్యవహరించాలన్నది ఆటగాళ్ల వ్యక్తిగత విషయం. ఆటగాళ్లు తమ శరీరం ఏం చెబుతోందో వినాలి" అని రోహిత్ అన్నాడు.
పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్లో పర్యవేక్షిస్తాం
"వరల్డ్కప్ చాలా ముఖ్యమైన టోర్నీనే. కానీ ఐపీఎల్ కూడా పెద్దదే. దానికీ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అన్నీ చూసుకుని పని భారాన్ని అంచనా వేసి ఎన్ని మ్యాచ్లు ఆడాలన్నది నిర్ణయం తీసుకోవాలి" అని రోహిత్ చెప్పాడు. భారత పేసర్ల ఫిట్నెస్పై ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. వెన్ను నొప్పితో బాధపడుతున్న స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై పనిభారాన్ని ఐపీఎల్లో పర్యవేక్షిస్తామన్నారు.