Neeraj Chopra: దోహా, పారిస్ డైమండ్ లీగ్లలో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో నీరజ్ చోప్రా మొదటిసారిగా 90 మీటర్ల కంటే ఎక్కువ దూరం జావెలిన్ను విసిరాడు. నీరజ్ చోప్రా పాకిస్థాన్కు చెందిన అర్షద్ నదీమ్, అండర్సన్ పీటర్స్ను అధిగమించి ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రాబోయే నీరజ్ చోప్రా క్లాసిక్కు ముందు స్టార్ స్పోర్ట్స్లో నీరజ్ చోప్రా ఇంటర్వ్యూ జరిగింది. ఇందులో ఏ భారత క్రికెటర్ జావెలిన్ త్రోయర్ గా కూడా రాణించగలడని అతడిని అడిగారు.
స్టార్ స్పోర్ట్స్లో నవజ్యోత్ సింగ్ సిద్దూ నీరజ్ చోప్రాను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఏ క్రికెటర్ జావెలిన్ త్రో కూడా ఆడితే విజయం సాధిస్తాడని ఆయన అడిగారు. దీనికి నీరజ్ చోప్రా విరాట్ కోహ్లీ పేరును గానీ, రోహిత్ శర్మ పేరును గానీ చెప్పలేదు. వేగవంతమైన త్రోలకు పేరుగాంచిన రవీంద్ర జడేజా వంటి ఫీల్డర్ పేరును కూడా ఆయన చెప్పలేదు. నీరజ్ చోప్రా జస్ప్రీత్ బుమ్రా పేరును చెప్పాడు. నీరజ్ చోప్రా మాట్రాడుతూ.. "నాకు తెలిసి అతను కేవలం ఫాస్ట్ బౌలర్ అయి ఉండాలి. బుమ్రా సరైన ఫిట్నెస్తో జావెలిన్ విసరడం చూడాలని నేను కోరుకుంటున్నాను" అని నీరజ్ చోప్రా అన్నాడు.

ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నీరజ్ చోప్రా
వరల్డ్ అథ్లెటిక్స్ ఈ వారం తన తాజా ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఇందులో నీరజ్ చోప్రా అగ్రస్థానంలో ఉన్నాడు. నీరజ్ చోప్రాకు 1445 పాయింట్లు ఉన్నాయి. అండర్సన్ పీటర్స్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. అతనికి 1431 పాయింట్లు ఉన్నాయి. దోహాలో జరిగిన డైమండ్ లీగ్లో అండర్సన్ 91.06 మీటర్ల త్రోతో నీరజ్ చోప్రాను కూడా వెనక్కి నెట్టాడు. కానీ ర్యాంకింగ్స్ లో నీరజ్ అతని కంటే ముందున్నాడు. రాబోయే ఎన్సీ క్లాసిక్లో అర్షద్ నదీమ్, జులియన్ వెబర్ ఆడరు.భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా అర్షద్ను ఆహ్వానించలేదు. నీరజ్ చోప్రా ప్రధాన ప్రత్యర్ధి అండర్సన్ పీటర్స్ అవుతాడు. పీటర్స్ గతేడాది సెప్టెంబర్ 17న బ్రస్సెల్స్లో డైమండ్ లీగ్ ఫైనల్ గెలిచి నీరజ్ నుండి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.