న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ దృష్టి సారిస్తే మంచిది: భారత్‌కు పదేళ్లు పడుతుంది!

https://twitter.com/ANI/status/1199282822353022976


హైదరాబాద్:
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో భారత్ నుంచి ఒక్క అంఫైర్ కూడా లేని సంగతి తెలిసిందే. అయితే, సమీప భవిష్యత్తులో భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి అంపైర్‌ ఒక్కరైనా వస్తారని అనుకోవడం లేదని మాజీ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్ అభిప్రాయపడ్డారు.

ఒక ప్రపంచ స్థాయి అంఫైర్‌ను సృష్టించడానికి భారత్‌కు ఒక దశాబ్దం పడుతుందని చెప్పుకొచ్చారు. 2015లో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఎస్ రవిని ఈ ఏడాది మొదట్లో ప్రకటించిన జాబితా నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. యాషెస్‌‌తో సహా 33 టెస్టులు, 48 వన్డేలు, 18 టీ20లకు రవి అంపైర్‌గా వ్యవహారించారు.

జాత్యాంహర వ్యాఖ్యలు: జోఫ్రా ఆర్చర్‌కు పెరుగుతున్న మద్దతుజాత్యాంహర వ్యాఖ్యలు: జోఫ్రా ఆర్చర్‌కు పెరుగుతున్న మద్దతు

తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో సైమన్ టౌఫెల్ మాట్లాడుతూ "ప్రపంచ స్థాయి అంపైర్‌ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారతదేశంలో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించినట్టు నాకు గుర్తు. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్లోకి ఎస్‌ రవి అడుగుపెట్టేందుకు కనీసం పదేళ్లు పట్టింది" అని అన్నారు.

"అందుకే బీసీసీఐ ఈ విషయంపై మరోసారి ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగా ఏదైనా తప్పు జరుగుతోందని అనుకోవడం లేదు. భారత్‌కు అంపైర్లు కావాలి. సౌరవ్ గంగూలీ (కొత్త బిసీసీఐ బాస్) దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయడం గురించి మాట్లాడే సందర్భంలో అంఫైరింగ్ ప్రోగ్రామ్‌ని కూడా దృష్టిసారించాలి" అని తెలిపారు.

10 రోజుల వ్యవధిలో 4 ఇన్నింగ్స్‌ విజయాలు.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు!!10 రోజుల వ్యవధిలో 4 ఇన్నింగ్స్‌ విజయాలు.. టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు!!

"ఇది అంపైర్ల గురించి మాత్రమే కాదు. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్స్‌ మేనేజర్‌, అంపైర్స్‌ కోచ్‌, అంపైర్స్‌ ట్రైనర్స్‌ను ప్రత్యేకంగా కేటాయించాలి. అందరూ సురక్షితంగా ఉండే, ప్రతిభకు పట్టం కట్టే వ్యవస్థను సృష్టించాలి" అని ఆస్ట్రేలియాకు చెందిన 48 ఏళ్ల సైమన్ టౌఫెల్ చెప్పుకొచ్చారు.

2012లో అంఫైరింగ్‌కు వీడ్కోలు పలికిన సైమన్ టౌఫెల్ అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ ఫెర్పామెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా కొనసాగారు. ఎస్ వెంకటరాఘవన్ తర్వాత ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంఫైర్ల జాబితాలో చోటు దక్కించుకున్న రెండో అంఫైర్‌గా ఎస్ రవి అరుదైన ఘనత సాధించాడు.

Story first published: Tuesday, November 26, 2019, 16:44 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X