
పాక్ బలాలు, బలహీనతలపై చర్చించాం
"హాంకాంగ్తో మ్యాచ్ పూర్తయిన వెంటనే పాక్ బలాలు, బలహీనతలపై చర్చించాం. పిచ్ పరంగా చూస్తే మాకు అనుకూలం. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లందరూ మంచి ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం ఉన్న భారత జట్టులోని ఆటగాళ్లలో కొంత మంది ఇంగ్లాండ్లో ఆడారు. మిగిలిన వాళ్లు మ్యాచ్ వాతావరణంపై దృష్టి సారించడానికి సిద్ధంగా ఉన్నారు" అని రోహిత్ శర్మ తెలిపాడు.
శిఖర్ ధావన్ ఫామ్లోకి
"శిఖర్ ధావన్ ఫామ్లోకి రావడం జట్టుకు కలిసిరానుంది. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో ఫామ్లో ఉన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన ఖలీల్ అహ్మద్ పాక్తో జరిగే మ్యాచ్పై ఆసక్తిగా ఉన్నాడు. పాక్తో జరిగే మ్యాచ్లో అతడు తప్పక రాణిస్తాడని ఆశిస్తున్నాం" అని రోహిత్ శర్మ అన్నాడు.
పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ మాట్లాడుతూ
అనంతరం పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ మాట్లాడుతూ "ఛాంఫియన్స్ ట్రోఫీ విజయం ఇప్పుడు మా మైండ్లో లేదు. మేం దాన్ని ఆసరాగా చేసుకుని సన్నద్ధం కాలేదు. లండన్ వాతావరణం వేరు. దుబాయ్ పరిస్థితులు వేరు. భారత్తో మ్యాచ్ అనగానే కొంత ఒత్తిడి సహజం" అని చెప్పాడు.
మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ ఆడండి
"కానీ మా జట్టు సభ్యులందరికీ నేను చెప్పేది ఒకటే. ఆందోళన అవసరం లేదు. మ్యాచ్ను ఎంజాయ్ చేస్తూ ఆడండి. ఫలితం గురించి పక్కన పెట్టండి. భారత్లో దీటైన బ్యాట్స్మెన్లు ఉన్నారు. వారి దగ్గర్నుంచి మాకు సరైన సవాలు ఎదురవుతుంది" అని సర్ఫ్రాజ్ అహ్మద్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
