వరల్డ్కప్లో రాయుడికి చోటు దక్కుతుందని!
గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడికి సెలక్టర్లు మొండిచేయి చూపించారు. వరల్డ్కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు, విజయ్ శంకర్లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని, చివరికి విజయ్ శంకర్వైపు మొగ్గు చూపామని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.
శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు
"NO.4 స్పాట్లో అంబటి రాయుడు, విజయ్ శంకర్లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు. శంకర్ బ్యాటింగ్, బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా. దీంతో శంకర్ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్లలో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు" అని ఎమ్మెస్కే అన్నాడు.
‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ ట్వీట్
దీంతో ఎమ్మెస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా వచ్చే వరల్డ్కప్ను ‘3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. రాయుడి ట్వీట్పై బుధవారం బీసీసీఐ స్పందించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ "రాయుడు చేసిన ట్వీట్ను మేం నోట్ చేసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అతని భావోద్వేగాన్ని అర్థం చేసుకున్నాం" అని అన్నారు.
రాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు
"అయితే, హద్దులు మీరకుండా ఆవేదనను బయటపెట్టుకోవాల్సిన అవసరం రాయుడిపై ఉంది. ఈ బాధ నుంచి తేరుకోవడానికి రాయుడికి కొంత సమయం పడుతోంది. దీనిని మేం అర్థం చేసుకోగలం. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోడం లేదు. ఎందుకంటే అతడు స్టాండ్బైగా ఎంపికయ్యాడు. జట్టులో ఎవరైన గాయపడితే రాయుడికి అవకాశం దక్కుతుంది. ఇంగ్లాండ్కి పయనమవుతాడు" అని ఆయన తెలిపారు.