
హైదరాబాద్: శ్రీలంక వేదికగా మార్చి 6 నుంచి ముక్కోణపు టీ20 సిరిస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ ముక్కోణపు సిరిస్లో శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటున్నాయి. శ్రీలంక స్వాతంత్య్ర వచ్చి 70 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
అలాంటి ప్రతిష్టాత్మక సిరీస్కు మ్యాచ్ రిఫరీగా క్రిస్ బ్రాడ్ను నియమించినట్లు సమాచారం. బ్రాడ్ ఇప్పటి వరకు 461 అంతర్జాతీయ మ్యాచ్లకు రిఫరీగా వ్యవహరించాడు. అందులో 93 టెస్టులు, 294 వన్డేలు, 74 టీ20 మ్యాచ్లు ఉన్నాయి. టోర్నీలో భాగంగా ప్రారంభ మ్యాచ్ మంగళవారం ఆతిథ్య శ్రీలంక, భారత్ మధ్య జరగనుంది.
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలను సెలక్టర్లు అప్పగించారు. ఈ టోర్నీకి వైస్ కెప్టెన్గా శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
ముక్కోణపు టీ20 సిరిస్ షెడ్యూల్:
1st Match - 6 March, Tuesday
Sri Lanka vs India
2nd Match - 8th March, Thursday
Bangladesh vs India
3rd Match - 10th March, Saturday
Sri Lanka vs Bangladesh
4th Match - 12th March, Monday
Sri Lanka vs India
5th Match - 14th March, Wednesday
Bangladesh vs India
6th Match - 16th March, Friday
Sri Lanka vs Bangladesh
Final - 18th Match, Sunday