
సై అంటే సై అంటూ..
ఈ వేలంపాట ఫస్ట్ ఆఫ్లో ఉండీ లేనట్టు కనిపించింది సన్రైజర్స్ హైదరాబాద్. తన ఆటతీరు తరహాలోనే ఫస్ట్ సెషన్లో క్రికెటర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫలితంగా- సోషల్ మీడియా వేదికగా విమర్శలను సైతం ఎదుర్కొంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్ కావ్య మారన్.. ఒక్కసారిగా విజృంభించింది. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను తీసుకోవడంతో ఈ ఐపీఎల్ వేలంపాటలో బోణీ కొట్టింది.

ఇషాన్ కిషన్ కోసం పోటీ..
ఆ తరువాత వికెట్ కీపర్ కేటగిరీలో ఐపీఎల్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ను జట్టులోకి తీసుకోవడానికి కావ్య మారన్ ప్రయత్నించింది. దీనికోసం ఆమె మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్ను ఢీ కొట్టడానికీ వెనుకాడలేదు. ఇషాన్ కిషన్ కోసం తొలుత ముంబై ఇండియన్స్- ప్రీతిజింతా సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. 14 కోట్ల రూపాయల వరకు వెళ్లింది. ఆ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది.

చివరి వరకూ ప్రయత్నం..
ఇషాన్ కిషన్ ప్రైస్ను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. చివరికి- 15 కోట్ల రూపాయలను కూడా ఖర్చు చేయడానికి వెనుకాడలేదు కావ్య మారన్. అటువైపు ఉన్నది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కావడం వల్ల ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఇషాన్ కిషన్ను దక్కించుకోవడానికి ఎంతవరకైనా వెళ్లేలా కనిపించింది నీతా అంబానీ. చివరికి- సన్రైజర్స్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనితో 15.25 కోట్ల రూపాయలకు అతణ్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది.

పూరన్ కోసం మారన్..
ఆ వెంటనే మరో వికెట్ కీపర్, వెస్టిండీస్ పించ్ హిట్టర్ నికొలస్ పూరన్ కోసం కావ్య మారన్ పట్టుబట్టింది. అతన్ని దక్కించుకోవడానికి వేర్వేరు ఫ్రాంఛైజీలో పోరాడింది. మొదటి నుంచీ పూరన్ కోసం ప్రయత్నించింది. కోల్కత నైట్ రైడర్స్ వంటి ఫ్రాంఛైజీలు రేటు పెంచినప్పటికీ- కావ్య మారన్ వెనక్కి తగ్గలేదు. చివరికి ఈ ధర 10 కోట్ల రూపాయలను దాటినా మడమ తిప్పలేదు. చివరికి- 10 కోట్ల 75 లక్షల రూపాయలతో నికొలస్ పూరన్ను జట్టులోకి తీసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ మెయిన్ వికెట్ కీపర్గా ఇక నికొలస్ పూరన్ వ్యవహరిస్తాడు.


Click it and Unblock the Notifications
