విలియమ్సన్ నిర్ణయం..
న్యూజిల్యాండ్ జట్టులో ట్రెంట్ బౌల్ట్ స్థానంలో ఆడమ్ మిల్నే ఆడుతున్నాడు. టీమిండియాలో ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, రిషభ్ పంత్లకు చోటు కల్పించారు. ఇద్దరూ లెఫ్ట్ హ్యండర్లు ఓపెనింగ్ చేస్తుండటం గమనార్హం. ఈ మైదానంలో చివరగా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచుల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుందని అంతా అనుుకున్నారు. కానీ కేన్ విలియమ్సన్ మాత్రం తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
ఈ మ్యాచ్కూ వర్షగండం..
మూడు టీ20ల సిరీస్లో వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన సంగతి తెలిసిందే. ఆగకుండా కురిసిన వర్షంతో కనీసం టాస్ కూడా వేయకుండానే ఆ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే రెండో టీ20 మ్యాచ్ జరుగుతున్న బే ఓవల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరి ఈ మ్యాచ్ అయినా పూర్తిగా జరుగుతుందేమో చూడాలి.
భారత జట్టు:
ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్
న్యూజిల్యాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్. డారియల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, ఐష్ సోధి, టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, లోకీ ఫెర్గూసన్