హైదరాబాద్: మిథాలీరాజ్ మహిళా క్రికెట్కే ఈ సంవత్సరం ఒక మైలురాయిని ఏర్పాటు చేశారు. మిథాలీరాజ్ సారథిగా వ్యవహరిస్తున్న జట్టు మహిళా ప్రపంచ కప్ ఫైనల్ వరకు చేరుకుంది. ఈ ఫైనల్ కేవలం 9 పరుగుల తేడాతో మాత్రమే భారత జట్టు ఓడింది.
ఎంత బాధాకరమైన ఓటమి అయినప్పటికీ, అక్కడ వరకు చేరుకోవడం కూడా ఓ విజయం అనే భావించాలి. పురుషాధిక్యాన్ని దాటుకుని వచ్చి ఇంత సాధించగలిగారంటే నిజంగా విజయమే.
ఇది కాకుండా మిథాలీరాజ్ ఈ ఏడాది ఆడిన వన్డే మ్యాచ్లలో ఏడు అర్ధసెంచరీలను చేశారు. జట్టులో ఉన్న అందరిలో ఎక్కువ పరుగులు సాధించి లీడింగ్లో ఉన్నారు. మొత్తం 6000పరుగులు సాధించి వన్డే మ్యాచ్ లలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు.
మహిళా ప్రపంచ కప్ సిరీస్ మొత్తంలో 1000 పరుగులు సాధించి ఐదో స్థానంలో ఉన్నారు. కెప్టెన్గా అత్యధిక పరుగులు చేసిన ఛార్లొట్ ఎడ్డర్డ్ 3523రికార్డును మిథాలీరాజ్ 3542పరుగులతో తుడిచి పెట్టేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.