ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య హామిల్టన్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ అనంతరం సెడాన్ పార్క్లో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని మార్లిబోన్ క్రికెట్ క్లబ్-బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పోరేషన్ సంయుక్తంగా న్యూజిలాండ్ జట్టుకు అందజేసింది.
20 ఫ్రాన్సీల వెండినాణెం విడుదల: జీవించి ఉన్న తొలివ్యక్తిగా రోజర్ ఫెదరర్ (వీడియో)
ఈ సందర్భంగా మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) అధ్యక్షుడు కుమార సంగక్కర మాట్లాడుతూ "న్యూజిలాండ్ జట్టు అవార్డును గెలుచుకున్నది. అద్భుతమైన ఫైనల్లో వాస్తవానికి టోర్నమెంట్లో తగిన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్రికెట్ ఆడినంత కాలం ఎక్కువ కాలం జ్ఞాపకార్థంగా నిలిచే మ్యాచ్ అది. ఇప్పటికీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. వారి చర్యలు ఈ గుర్తింపుకు అర్హమైనవి" అని అన్నాడు.
"Their actions deserve the recognition."
— ICC (@ICC) December 3, 2019
New Zealand's graceful conduct in the immediate aftermath of their close #CWC19 Final defeat has earned them the MCC #SpiritOfCricket award.https://t.co/AbqCmjdvW0
పైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఇంగ్లాండ్ విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మార్టిన్ గప్టిల్ విసిరిన త్రో అనూహ్యంగా బెన్స్టోక్స్ బ్యాట్కు తగిలి బౌండరీ వెళ్లింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ తీసిన రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో వల్ల అదనంగా మరో నాలుగు పరుగులు ఆ జట్టుకు కలిసివచ్చాయి.
భారత్ తలపడే ప్రతి సిరిస్లోనూ ఓ డే నైట్ టెస్టు మ్యాచ్: గంగూలీ
ఈ ఓవర్ త్రో కారణంగా మ్యాచ్ ఫలితమే తారుమారైంది. ఈ పరుగుల కారణంగా తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ను నిర్వహించారు. సూపర్ ఓవర్లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.