వెల్లింగ్టన్: ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా వెల్లింగ్టన్లోని వెస్ట్పాక్ స్టేడియంలో న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య మరికొద్దిసేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టీమ్ సౌథీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్లో కివీస్ రెండు మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన కేన్ విలియమ్సన్ బదులుగా డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆల్రౌండర్ గ్రాండ్హోమ్ స్థానంలో టామ్ బ్రూస్ ఆడుతున్నాడు.
'బుమ్రా బౌలింగ్లో ఆడడం కష్టం.. అదృష్టవశాత్తూ మూడో మ్యాచ్లో సమర్థవంతంగా ఎదుర్కొన్నాం'
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులో మూడు మార్పులు చేసాడు. రోహిత్ శర్మ, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలకు విశ్రాంతిని ఇచ్చారు. వీరి స్థానంలో సంజు సాంసన్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చారు. నాలుగో టీ20లో న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ విలియమ్సన్ బుజ గాయం కారణంగా ఆడడం లేదు. అతడు కోలుకోవడానికి రెండు రోజుల సమయం పడుతుందని సౌథీ తెలిపాడు.
వెస్ట్పాక్ స్టేడియంలోని పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వర్షంతో ఎలాంటి సమస్య లేదు. 2014 నుంచి ఇక్కడ ఆడిన వరుస ఆరు మ్యాచ్లలో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మైదానంలో జరిగిన 11 మ్యాచ్ల్లో ఒక్కసారి మాత్రమే స్కోరు 200 దాటింది. చివరి ఐదు టీ20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరు 178. ఇందులో ఒక్కసారి మాత్రమే చేజింగ్ టీమ్ నెగ్గింది.
తుది జట్లు:
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, సంజూ శాంసన్, అయ్యర్, పాండే, దూబే, వాషింగ్టన్ సుందర్, శార్దుల్, చహల్, బుమ్రా, సైనీ.
న్యూజిలాండ్: టిమ్ సౌతీ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, మన్రో, రాస్ టేలర్, టామ్ బ్రూస్, డారిల్ మిషెల్, సీఫెర్ట్, సాన్ట్నర్, కుగ్లీన్, సోధి, బెన్నెట్.