
కివీస్ విజయం సాధించినా..!
న్యూజిలాండ్ విజయం సాధించింది కదా ఆ జట్టు ఖాతాలో 60 పాయింట్లు చేరాయి అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్ను ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్లో చేర్చలేదు. టెస్ట్ చాంపియన్షిప్(2019-21) నిబంధన ప్రకారం ప్రతిజట్టూ ఆరు సిరీస్లు ఆడాలి.

స్వదేశంలో మూడు, విదేశంలో మూడు
ఇందులో స్వదేశంలో మూడు విదేశంలో మూడు ఉంటాయి. ఈ నిబంధన కారణంగానే న్యూజిలాండ్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరిస్ను టెస్ట్ చాంపియన్షిప్లో చేర్చలేదు. ఈ సిరీస్ను గనుక ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్లో చేర్చితే.. ఇంగ్లాండ్ బయట ఎక్కువ సిరీస్లు ఆడాల్సి వచ్చేది.

వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో లేదు
దీంతో ఈ టెస్టు సిరీస్ను వరల్డ్ టెస్టు చాంపియన్షిప్లో చేర్చలేదు. ఈ సిరిస్ను టెస్టు ఛాంపియన్షిప్లో చేర్చలేదు కాబట్టి న్యూజిలాండ్ గెలిచినా ఓడినా ఆ జట్టుకు పాయింట్లు రావు. మౌంట్ మాంగని వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధించినప్పటికీ ఆ జట్టు ఖాతాలో పాయింట్లు చేరలేదు.

కివీస్ అభిమానులు అసంతృప్తి
దీంతో న్యూజిలాండ్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 65 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో కివీస్ ఆటగాడు వాట్లింగ్ డబుల్ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


Click it and Unblock the Notifications
