పరిమితికి మించి మూడు రెట్ల మద్యం
జెస్సీ రైడర్ ఫిబ్రవరి 7 న నేపియర్లోని తారాడేల్లో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకి చిక్కాడు. ఆ సమయంలో అతను పరిమితికి మించి మూడు రెట్లు ఎక్కువగా మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 873 మైక్రోగ్రాముల శ్వాస ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది. ఇది 250 ఎంసిజి పరిమితి కంటే మూడు రెట్లు ఎక్కువ. దీంతో రైడర్పై పోలీసులు కేసు నమోదు చేసారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సెలింగ్
కేసు నమోదు కావడంతో 35 ఏళ్ల జెస్సీ రైడర్ ఈ రోజు నేపియర్ కోర్టులో హాజరయ్యాడు. న్యాయమూర్తి బ్రిడ్జేట్ మాకింతోష్ రైడర్కు తొమ్మిది నెలల పర్యవేక్షణ శిక్ష విధించారు. అంతేకాదు డ్రంక్ అండ్ డ్రైవ్ కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు 28 రోజుల పాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధించారు. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లో జెస్సీ రైడర్ పట్టుబడటం ఇది మూడోసారి.
మద్యానికి బానిసై
2008లో అరంగేట్రం చేసిన రైడర్ కెరీర్ ఆరంభం నుండే వివాదాల్లో చిక్కుకున్నాడు. అర్ధరాత్రి వరకూ మద్యం సేవించి గొడవలు పడేవాడు. మద్యానికి బానిసై మరుసటి రోజు జట్టు మీటింగ్స్, ప్రాక్టీస్కి డుమ్మా కొట్టి క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్నాడు. ఒకానొక దశలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు రైడర్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ లాభం లేకపోయింది. మద్యానికి బానిసై జట్టులో చోటు కోల్పోయాడు.
వన్డేల్లో ఓపెనర్గా
2008 నుంచి 2014 వరకూ టెస్టుల్లో మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసిన జెస్సీ రైడర్.. వన్డేల్లో ఓపెనర్గా వచ్చేవాడు. మెరుపు ఇన్నింగ్స్లు ఆడడం అతని శైలి. కేవలం బ్యాటింగే కాదు .. మీడియం పేస్ బౌలింగ్ కూడా వేసేవాడు. క్రమశిక్షణలేమితో అర్ధాంతరంగా కెరీర్ని ముగించాడు. న్యూజిలాండ్ టీమ్లోకి 2008లో అరంగేట్రం చేసిన జెస్సీ రైడర్.. 18 టెస్టులు, 48 వన్డేలు, 22 టీ20 మ్యాచ్లు ఆడాడు.