IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్ జట్లు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నేడు తలపడనున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ లెజెండ్ జునైద్ ఖాన్ చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టించింది. ఈ పాక్ మాజీ పేసర్ తన అక్కసును వెళ్లగక్కాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ లో న్యూజిలాండ్ జట్టు 7150 కిలోమీటర్లు ప్రయాణించి.. ఆపై ఫైనల్ కు చేరుకుందని.. కానీ టీమిండియా అసలు ప్రయాణించలేదని జునైద్ ఖాన్ అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు దుబాయ్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరుకున్న తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించి చర్చ తారాస్థాయికి చేరుకుంది. టీమిండియా ఒకే చోట ఆడటం వల్ల ప్రయోజనం పొందిందని కామెంట్లు చేస్తూనే ఉన్నారు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనిపై స్పందించారు. కానీ ఫైనల్ మ్యాచ్ కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ పేసర్ జునైద్ ఖాన్ మళ్లీ ఈ విషయాన్ని లేవనెత్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ల సమయంలో అన్ని జట్ల ప్రయాణం గురించి జునైద్ ఖాన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Distance traveled between matches in Champions Trophy 2025:
— Junaid khan (@JunaidkhanREAL) March 8, 2025
• New Zealand: 7,150 KM ✈️
• South Africa: 3,286 KM ✈️
• India: 0 KM 🏡
Some teams win by skill, some win by scheduling... #indvsnzfinal #indvsnz #ChampionsTrophy2025 #ChampionsTrophy
ఏ జట్లు ఎన్ని కిలోమీటర్లు ?
న్యూజిలాండ్-7150 కిలోమీటర్లు
దక్షిణాఫ్రికా-3286 కిలోమీటర్లు
భారత్-0 కిలోమీటర్లు
జునైద్ ఖాన్ పోస్ట్ ద్వారా పరోక్షంగా దుబాయ్ లో టీమిండియా ఆడడాన్ని వ్యతిరేకిస్తున్నాడని.. అదే పిచ్ పై ఆడడం వల్ల భారత్ ప్రయోజనం పొందిందని అతను నమ్ముతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.