దినేష్ కార్తీక్ న్యూజిలాండ్ మీద టీ 20 సిరీస్ లో చివరి ఓవర్ లో సింగల్ కోసం ప్రయత్నించక పోవటం తో అందరి చేత విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియా లో అయితే దినేష్ కార్తీక్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. నువ్వేమైనా ధోనివా అంటూ నెటిజన్స్ విరుచుకుపడ్డారు.ఈ నేపధ్యం లో వరల్డ్ కప్ లో దినేష్ కార్తీక్ పేరు బదులు రిషబ్ పంత్ పేరు వినిపించడానికి ఇది ఒక కారణమని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.
దినేష్ కార్తీక్ ను తన లక్ష్యాల గురించి అడిగినప్పుడు అతను మాట్లాడుతూ, " నాకు లక్ష్యాలను పెట్టుకోవటం నచ్చదు. నేను లక్ష్యాలను పెట్టుకొని ఆడే రకం కాదు అలా చేస్తే నేను ఆటను ఆస్వాదించలేను. మైదానం లోకి దిగిన తరువాత నా పూర్తి సామర్ధ్యం తో ఆడాలనుకుంటాను అని" చెప్పుకొచ్చాడు. అయితే మార్చి 24 న సన్ రైజర్స్ హైదరా బాద్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ తలపడనున్నది.
అయితే బెంగాల్ లో ఇంకా ఎన్నికల తేదీ ఖరారు కాక పోవటం తో మ్యాచ్ లు తరలించే అవకాశం ఉందని ఊహాగానాలు విని పిస్తున్నాయి. ఇదే విషయం మీద దినేష్ కార్తీక్ స్పందించాడు. నిజంగా మ్యాచ్ లు ఈడెన్ నుంచి తరలిస్తే మేము చాలా మిస్ అవుతామని చెప్పుకొచ్చాడు. ఈడెన్ గార్డెన్స్ లో అరవై వేల మంది ముందు ఆడటం అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.