న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నేపాల్, యూఏఈ, నెదర్లాండ్స్‌కు చోటు

By Nageshwara Rao
Nepal, UAE, Netherlands join ICC ODI rankings

హైదరాబాద్: జూన్ 1, 2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే వన్డే ర్యాంకింగ్స్ జాబితాలోకి మరో నాలుగు జట్లు కొత్తగా వచ్చి చేరాయి. ఇప్పటివరకు ఐసీసీ ప్రకటించే వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో కేవలం 12 జట్లు మాత్రమే ఉండేవి.

తాజాగా నేపాల్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, యూఏఈ జట్లను పాయింట్ల పట్టికలో చేర్చినట్లు ఐసీసీ శుక్రవారం తన ట్విట్టర్‌లో పేర్కొంది. వన్డే ర్యాంకింగ్స్ కోసం రేటింగ్ పాయింట్లను లెక్కించే ముందు కొత్త జట్లు ఆడిన అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొంది.

గతేడాది ఐసీసీ నిర్వహించిన వరల్డ్ క్రికెట్ లీగ్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకుని నెదర్లాండ్స్ తన వన్డే స్టేటస్‌ను నిలుపుకున్న సంగతి తెలిసిందే. నెదర్లాండ్స్‌తో పాటు మిగతా మూడు జట్లు నేపాల్, స్కాట్లాండ్, యూఏఈ కూడా వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో రాణించి వన్డే స్టేటస్‌ను నిలబెట్టుకున్నాయి.

దీంతో వన్డే హోదా సాధించిన వాటిలో స్కాట్లాండ్ 28 పాయింట్లతో 13వ ర్యాంకులో నిలవగా, యూఏఈ 18పాయింట్లతో 14వ ర్యాంకులో నిలిచింది. నేపాల్, నెదర్లాండ్స్ జట్లు చెరో నాలుగు మ్యాచ్‌లు ఆడిన తరువాత పాయింట్ల పట్టికలో పూర్తిస్థాయి ర్యాంకింగ్‌ను పొందనున్నాయి.

ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో సూపర్ సిక్స్‌కు అర్హత సాధించిన స్కాట్లాండ్, యూఏఈలు తమ అంతర్జాతీయ వన్డే హోదాను 2022ను కాపాడుకోగలిగాయి. క్వాలిఫయర్స్‌లో పపువా న్యూగినియాపై గెలుపొంది నేపాల్ అంతర్జాతీయ వన్డే జట్టు హోదాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, June 1, 2018, 15:56 [IST]
Other articles published on Jun 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X