భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మోచేతి గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు అని భారత అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు అదిల్లే సుమరివాలా తెలిపారు. వరల్డ్ చాంపియన్షిప్లో పాల్గొనేందుకు సాధన చేస్తున్న క్రమంలోనీరజ్ చోప్రా కుడి మోచేతికి గాయం అయింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే ముంబైలోని ప్రముఖ కోకిలాబేన్ ఆసుపత్రిలో నీరజ్ చోప్రాకు శస్త్రచికిత్స జరిగింది. గురువారం నీరజ్ కోలుకుంటున్నాడని అదిల్లే సుమరివాలా తెలిపారు. 'ప్రస్తుతం అతడికి ఫిజియో తెరపీ జరుగుతోంది. ఇప్పటికే నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. నీరజ్ గాయం గురించి డాక్టర్లతో మాట్లాడుతా. ప్రస్తుతం అతను అన్ని పనులు చేస్తున్నాడు. అతని రిపోర్టులు అన్ని బాగున్నాయి' అని అదిల్లే తెలిపారు.
🗣️ “We are taking step by step"
— The Bridge (@TheBridge_IN) May 17, 2019
⭐️ Javelin thrower @Neeraj_chopra1 will not be rushed into any competition, including the World Championships later this year. pic.twitter.com/Tq8mmhl9s7
'వరల్డ్ చాంపియన్షిప్ గురించి అతనితో ఇప్పుడే చర్చించడం లేదు. దాని గురించి ఆలోచిస్తే.. నీరజ్ మరింత బలంగా విసిరేందుకు యత్నిస్తాడు. మొదటగా అతను కోలుకోవడంపై దృష్టిపెట్టాం' అని అదిల్లే పేర్కొన్నారు. నీరజ్ గతేడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాలు నెగ్గిన విషయం తెలిసిందే. గాయం కారణంగా నీరజ్ వరల్డ్ చాంపియన్షిప్కు దూరమయ్యాడు.