హైదరాబాద్: పింక్ బాల్ టెస్టు నిర్వహణలో క్రికెట్ నాణ్యత విషయంలో ఏ స్థాయిలోనూ రాజీపడకుండా చూసుకోవాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐకి సూచించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య చారిత్రాత్మక డే నైట్ టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది.
ప్లడ్ లైట్ల వెలుగులో జరుగుతున్న ఈ మ్యాచ్లో పింక్ బాల్ను వాడనున్నారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ "టెస్ట్ క్రికెట్లో ఈ కొత్త అంశం స్టేడియంలోకి ఎక్కువ మందిని తీసుకురావడం ఉపయోగపడుతుంది. ఈ కొత్త ప్రయోగం అవసరమే. ఆ తర్వాత మ్యాచ్ ఎలా సాగిందో సమీక్షించాలి. మంచు ఎంత కురిసింది, ఆట ప్రమాణాల ప్రకారం సాగిందా, రాజీ పడ్డారా వంటి వాటిని విశ్లేషించాలి" అని సచిన్ అన్నాడు.
క్రెయిగ్ రికార్డు బద్దలు: ఆస్ట్రేలియా గడ్డపై పాక్ పేసర్ అరుదైన ఘనత