
ప్రస్తుతం దేవాంగ్ గాంధీ ఈస్ట్ జోన్ నుండి జాతీయ సెలెక్టర్గా కొనసాగుతున్నారు. రెండో రోజైన గురువారం ఆటలో భాగంగా దేవాంగ్ గాంధీ బెంగాల్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లాడు. దీనిపై బెంగాల్ జట్టులోని సీనియర్ ఆటగాడు మనోజ్ తివారీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. సెలక్టర్ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్లోకి ఎలా వస్తాడంటూ నిలదీశాడు.
దీనిపై బెంగాల్ ఆటగాళ్లు ఫిర్యాదు చేయడంతో దేవాంగ్ గాంధీని డ్రెస్సింగ్ రూమ్ నుంచి బీసీసీఐ అవినీతి నిరోధక అధికారి సౌమెన్ కర్మకర్ బయటకు పంపించే వేశారు. అవినీతి నిరోధక ప్రోటోకాల్ గురించి బెంగాల్ సీనియర్ ఆటగాళ్ళు ప్రశ్న లేవనెత్తడంతో వివాదం చెలరేగింది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఆటగాళ్ళు, జట్టు సహాయక సిబ్బంది మాత్రమే డ్రెస్సింగ్ రూమ్లో ఉండాలి.
ఈ వివాదంపై మనోజ్ తివారీ మాట్లాడుతూ "మేము అవినీతి నిరోధక కోడ్ను ఫాలో కావాలి. ఒక జాతీయ సెలక్టర్ అయిన దేవాంగ్ గాంధీ ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా డ్రెస్సింగ్ రూమ్లోకి రాకూడదు. డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లతో పాటు జట్టుకు సంబంధించిన వారు మాత్రమే ఉండాలి. దేవాంగ్ ఎందుకు అతిక్రమించాడు" అని రిపోర్టర్లతో తెలిపాడు.
ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగాల్ 281/7 వద్ద ఉండగా మ్యాచ్కు బ్యాడ్లైట్ అంతరాయం కలిగించింది. రెండో రోజైన గురువారం బెంగాల్ 289 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్లో బెంగాల్ ఆటగాడు అభిషేక్ రామన్(112) సెంచరీ సాధించాడు.