నాటింగ్హామ్: క్రికెట్ ప్రపంచమంతటా వినిపిస్తున్న పేరు విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ లెజెండ్గా పిలవబడుతోన్న కోహ్లీపై ఇంగ్లాండ్ జట్టు మాజీ కెప్టెన్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు. ఈ భూగ్రహం మీదనే కోహ్లీ అంత గొప్ప బ్యాట్స్మన్ మరెవరూ లేరని చెప్పుకొచ్చాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్-ఇండియాల మూడో టెస్టులో భారత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ముగిసింది.
రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటింగ్లో విఫలమైందని విమర్శలు వినిపించడంతో భారీ పట్టుదలతో బ్యాటింగ్కు దిగిన కోహ్లీసేన అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో బ్యాట్స్మెన్ అంతా రాణించిన వేళ కోహ్లీ.. 197 బంతుల్లో 103 పరుగులు చేసి అదరగొట్టాడు. రెండో టెస్టులో వెన్నునొప్పితో బాధపడిన కోహ్లీ మూడో టెస్టులో ఆడతాడా అనే సందేహాలు మ్యాచ్కు ముందు వరకూ ఉన్నాయి. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ.. సెంచరీ బాదేశాడు. '
ఈ టెస్టు ప్రదర్శనతో కలిపి కోహ్లీపై హుస్సేన్ ప్రశంసలు కురిపించాడు. 'కోహ్లీ అందరినీ మాయలో పడస్తాడు. బౌలర్కు అనుకూలంగా ఉన్న పిచ్లో కూడా పరుగుల వరద పారించడం అంత సులువేం కాదు. కానీ, కోహ్లీ దానిని సునాయాసంగా చేసి చూపించాడు. అతనొక అద్భుతమైన ఆటగాడు' అని తెలిపాడు.
'నేను చాలా సార్లు గమనించాను. అతను మ్యాచ్లోని పలు పరిస్థితులన్నిటికీ సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలడు. ఈ గ్రహం మీద అంతకంటేమంచి ప్లేయర్ లేడనుకుంటా. తీవ్రమైన ఒత్తిడిలో ఉండి కూడా.. అండర్సన్, స్టోక్స్, జోస్ బట్లర్ లాంటి వాళ్లతో సాధారణంగా స్పందిస్తుంటాడు. కానీ, స్ట్రైక్లోకి వచ్చాడా పూర్తిగా మారిపోతాడు.' అని వివరించాడు.