చెన్నై: ఏప్రిల్ 8 నుంచి జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్లో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ విభాగంలో మరింతగా బలపడనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెస్టిండిస్ స్పిన్ దిగ్గజం సునీల్ నరేన్కు చెన్నైలో నిర్వహించిన బౌలింగ్ పరీక్షలో గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.
సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బౌలింగ్ కమిటీ, నరేన్ బౌలింగ్ యాక్షన్పై చెన్నైలోని శ్రీ రామచంద్ర యూనివర్సిటీలో గురువారం పరీక్షలు నిర్వహించి, ఆ నివేదికను బీసీసీఐకి సమర్పించింది.
బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆదివారం నాడు ఈ నివేదికపై మాట్లాడుతూ సునీల్ నరేన్ బౌలింగ్ యాక్షన్కు గ్రీన్ సిగ్నిల్ వచ్చిందని, నరేన్ బౌలింగ్ను ఐపీఎల్లో చూడబోతన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ ఆరోపణలతో గత ఏడాది ఆగస్టు నుంచి అంతర్జాతీయ క్రికెట్కు సునీల్ నరేన్ దూరమయ్యారు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు 2012, 2014లో టైటిల్ ఛాంపియన్స్గా నిలవడంలో సునీల్ నరేన్ కీలకపాత్ర పోషించాడు.