
శ్రీనివాసన్
మ్యాచ్ ఫిక్సింగ్లో ఇతడి పాత్ర లేదు. ఫిక్సింగ్ పైన విచారణను అడ్డుకోవడానికి కూడా ఇతడు ప్రయత్నించలేదు. కానీ ఇతడికి, నరో నలుగురికి ఒకరి అవినీతి వ్యవహారాల గురించి తెలుసు. కానీ చర్యలు తీసుకోలేదు.

గురునాథ్ మీయప్పన్
గురునాథ్ ఫిక్సింగ్కు పాల్పడ్డట్లు చూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఇతడు చెన్నై జట్టు అధికారేనని, చట్ట వ్యతిరేకమైన బెట్టింగుకు పాల్పడ్డాడని విచారణలో తేలింది.

సుందర రామన్
బుకీ తెలుసునని ఒప్పుకున్నాడు. ఒక సీజన్లో వారితో 8సార్లు మాట్లాడాడు. కానీ ఆ వ్యక్తి బెట్టింగు కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తనకు తెలియదన్నాడు. మయప్పన్, రాజ్ కుంద్రా బెట్టింగుకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని అంగీకరించాడు. కానీ అది చర్యలు తీసుకోదగ్గ సమాచారం కాదని ఐసీసీ అవినీతి నిరోదక బృందం అధినేత చెప్పాడు. సమాచారం తన వద్దే ఉంచుకున్నానని, ఎవరికీ చెప్పలేదని కూడా తెలిపాడు.

రాజ్ కుంద్రా
బెట్టింగ్ కోసం బుకీలతో సంబంధాలు పెట్టుకున్నాడు. బుకీలతో తన పరిచయం గురించి వెల్లడించకపోవడం ద్వారా నియమావళి ఉల్లంఘించాడు. ఇతడి పైన విచారణ అర్ధంతరంగా ఆగిపోయింది. ఎలాంటి కారణాలు లేకుండా రాజస్థాన్ పోలీసులు విచారణ ఆపారు. ఇతడి స్నేహితుడు పెద్ద పందెరాయుడు. ఇతడి తరఫున బెట్టింగుకు పాల్పడ్డట్లు కమిటి ముందు అంగీకరించాడు. ఇతటు బెట్టింగ్ చేశాడు లేదా బెట్టింగ్ చేసే మిత్రుడికి హామీగా ఉన్నాడనేందుకు ఆధారాలున్నాయి.


Click it and Unblock the Notifications











