న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది నా జీవితంలో విషాదకరమైన రోజు: మిథాలీ రాజ్

This Is The Darkest Day In My Life Says Mithali Raj
My patriotism doubted, darkest day of my life: Mithali responds to Powars allegations

న్యూ ఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న వివాదాలతో మిథాలీ రాజ్ తన జీవితంలో చీకట్లు అలముకున్నాయని ఆమె ట్విట్టర్ వేదికగా ఆవేదనను మరోసారి వెల్లగక్కింది. గురువారం ఉదయమే జట్టులో తనకు చోటు దక్కకపోవడం పట్ల తీవ్రమైన నిరుత్సాహానికి గురైన మిథాలీ తన ఇన్నేళ్ల కష్టమంతా వృథా అయిందని 20 ఏళ్ల శ్రమకు ఫలితమిదేనా అంటూ నిరాశను బయటపెట్టింది. ఇప్పటికే పలువురు మాజీలు మిథాలీకి సానుభూతి వ్యక్తం చేస్తుండగా తనకు జరిగిన అన్యాయానికి ఏ ఒక్కరూ న్యాయం చేసే విధంగా మాట్లాడట్లేదు.

కఠోర శ్రమ, నిబద్ధత.. అంతా మట్టిలో కలిసి

'నేను చాలా విషాదానికి లోనైయ్యాను. నాకు విలువ లేకుండా జట్టులో నుంచి తీసెయ్యడం చాలా బాధనిపిస్తుంది. జట్టు పట్ల చూపించిన నిబద్ధత, 20ఏళ్ల పాటు దేశం కోసం పడ్డ కృషి అంతా నీరుగారిపోయింది. కఠిన శ్రమ, స్వేదం చిందించి మైదానంలో ఆడిన రోజు, నా బాధ అంతా మట్టి కలిసిపోయాయి.

చివరికి జట్టులో నా పాత్రే అనుమానంగా మారింది. నా ప్రతిభ పట్ల అనుమానాలు మొదలైయ్యయి. ఇన్నేళ్లు ఆడి సాధించినదంతా మరుగున పడిపోయింది. నా జీవితంలో ఇదొక విషాదకరమైన రోజు, దేవుడే నాకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నానని' మనో వేదనను బహిర్గతం చేసింది.

మిథాలీ ఆవేదన వ్యక్తం చేస్తూ ..

మిథాలీ ఆవేదన వ్యక్తం చేస్తూ ..

ఇటీవల టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాడ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మిథాలీని తప్పించారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కోచ్‌ రమేశ్‌ పవార్‌, బీసీసీఐ పాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జీలపై ఆరోపణలు చేశారు. వారి వల్లే తనకు న్యాయం జరిగిందంటూ మిథాలీ బీసీసీఐకి మెయిల్‌ పంపారు. ఈ వివాదంపై మిథాలీ రాజ్ తొలిసారి లేఖ ద్వారా స్పందించారు. జట్టు కోచ్ రమేశ్ పవార్ తనను అవమానించారంటూ.. మిథాలీ లేఖ ద్వారా తన సందేశాన్ని బీసీసీఐకి పంపించారు.

రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పవార్‌

రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పవార్‌

జట్టు నుంచి తప్పించారని తెలిసి ఎంతో ఆవేదనకు గురైయ్యానని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిసిన జట్టు కోచ్‌ రమేశ్‌ పొవార్‌.. మిథాలీపై పలు ఆరోపణలు చేశారు. మిథాలీ ఓపెనర్‌గా ఆడతానని పట్టుబట్టిందని.. లేదంటే ప్రపంచకప్‌ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్‌ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పొవార్‌ బోర్డుకు అందించిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

Story first published: Thursday, November 29, 2018, 13:05 [IST]
Other articles published on Nov 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X