న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ‌న‌సు కివీస్ వైపు..మైండ్ ఇంగ్లండ్ వైపు: గౌత‌మ్ గంభీర్‌

My heart wants New Zealand but mind says England, said Gambhir

న్యూఢిల్లీ: ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ మెగా ఈవెంట్‌లో చిట్ట‌చివ‌రి మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతోంది. లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో ఆతిథ్య జ‌ట్టు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జ‌ట్లు విశ్వ‌విజేత‌గా నిల‌వ‌డానికి హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫ‌లితం ఎలా ఉంటుందో తెలియాలంటే మ‌రి కొన్ని గంట‌లు ఆగాల్సిందే. ఈ ప‌రిస్థితుల్లో ఎవ‌రికి వారు త‌మ ఊహ‌లకు అనుగుణంగా అంచ‌నాలు వేసుకుంటున్నారు. ఇంగ్లండ్ గెలుస్తుంద‌ని కొంద‌రు, కివీస్ క‌ప్ కొట్టేస్తుంద‌ని ఇంకొంద‌రు.. ఇలా త‌మ అభిప్రాయాల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటున్నారు.

మైండ్ అలా..మ‌న‌స్సు ఇలా..

మైండ్ అలా..మ‌న‌స్సు ఇలా..

ఇందులో మెజారిటీ మాత్రం ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప‌లువురు మాజీ క్రికెట‌ర్లు ఇంగ్లండ్‌కే జైకొడుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. రెండో సెమీ ఫైన‌ల్‌లో ఆ జ‌ట్టు ఆస్ట్రేలియాను ఖంగు తినిపించిన విధాన‌మే. ఇదిలావుండ‌గా- టీమిండియా మాజీ ఓపెన‌ర్, లోక్‌స‌భ స‌భ్యుడు గౌత‌మ్ గంభీర్ సైతం ఈ జాబితాలో చేరిపోయారు. ఏ జ‌ట్టు గెలుస్తుంద‌నే విష‌యాన్ని ఆయ‌న విస్ప‌ష్టంగా వెల్ల‌డించ‌లేదు. అయిన‌ప్ప‌టికీ- ఆయ‌న ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెల‌వాల‌ని త‌న మైండ్ కోరుకుంటోంద‌ని గౌత‌మ్ గంభీర్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఓ ప్ర‌ముఖ ఆంగ్ల దిన‌ప‌త్రిక‌లో ఆయ‌న ఓ వ్యాసాన్ని రాశారు.

 ఇంగ్లండ్ తిరిగి చూసుకోకూడ‌దంతే!

ఇంగ్లండ్ తిరిగి చూసుకోకూడ‌దంతే!

27 సంవ‌త్స‌రాల త‌రువాత తొలిసారిగా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్ జ‌ట్టు.. ఇక వెనుదిరిగి చూసుకోకూడ‌ద‌ని త‌న మైండ్ కోరుకుంటోంద‌ని అన్నారు. ఇన్నేళ్ల‌కైనా ఆ జ‌ట్టు క‌ప్‌ను అందుకోవాల‌ని అభిలాషిస్తోంద‌ని చెప్పారు. త‌న మ‌నసు మాత్రం న్యూజిలాండ్ వైపు ఉంద‌ని గంభీర్ తెలిపారు. ఆ జ‌ట్టు సైతం ఒక్క‌సారి కూడా ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వ‌లేద‌ని అన్నారు. పైగా- 2015లో మాత్ర‌మే తొలిసారిగా ఫైన‌ల్‌లోకి అడుగు పెట్టింద‌ని గుర్తు చేశారు. వ‌రుస‌గా రెండోసారి ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్‌లో న్యూజిలాండ‌ర్లు గెల‌వాల‌ని త‌న మ‌న‌సు అకాంక్షిస్తోంద‌ని గంభీర్ అన్నారు. న్యూజిలాండ్ జ‌ట్టు కేప్టెన్ కేన్ విలియ‌మ్స్‌పై విప‌రీతంగా ఆధార‌ప‌డుతోంద‌ని అన్నారు. కేన్ విలియ‌మ్స‌న్ ఓ హీరోలా మారార‌ని కితాబిచ్చారు.

ఒత్తిడిని బాధ్య‌త‌గా భావిస్తోన్న విలియ‌మ్స‌న్‌

ఒత్తిడిని బాధ్య‌త‌గా భావిస్తోన్న విలియ‌మ్స‌న్‌

జ‌ట్టుకు సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను వహించే స‌మ‌యంలో ఏ ఆట‌గాడైనా కొంత ఒత్తిడికి గుర‌వుతాడ‌ని, అది అత‌ని బ్యాటింగ్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అన్నారు. కేన్ విలియ‌మ్సన్ విష‌యంలో ఇది పూర్తిగా విరుద్ధ‌మ‌ని అన్నారు. కేప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన‌ప్ప‌టి నంచీ అత‌ను చెల‌రేగిపోయి ఆడుతున్నాడ‌ని, ఒత్తిడికి బ‌దులు బాధ్య‌త‌గా భావిస్తున్నాడని చెప్పారు. అందుకే- త‌న మ‌నసు కివీస్ గెల‌వాల‌ని కోరుకుంటోంద‌ని అన్నారు.

ఏది జ‌రిగినా చివ‌రికి గెలిచేది మాత్రం క్రికెట్టేన‌ని ముక్తాయింపునిచ్చారు.

1
43691

{headtohead_cricket_2_4}

Story first published: Sunday, July 14, 2019, 16:44 [IST]
Other articles published on Jul 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X