
చాలా రోజుల విరామం తర్వాత
చాలా రోజుల విరామం తర్వాత నెట్స్లో ప్రాక్టీస్ చేయడం ఎలా ఉందని అడిగిన ప్రశ్నకు చాలా బాగుందని చెప్పాడు. "విరామ సమయంలో నా శరీరం బాగా స్పందించింది. ఎప్పుడైనా జట్టులోకి తిరిగి వెళ్లినప్పుడు అక్కడున్న వారిని చూస్తే మరింత రాణించాలని అనిపిస్తుంది. అప్పుడు వికెట్లు తీయాలనే కసి పెరుగుతుంది" అని బుమ్రా వెల్లడించాడు.

మూడు టీ20ల సిరీస్లో భాగంగా
మూడు టీ20ల సిరీస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం గువాహటి వేదికగా తొలి టీ20 జరగనుంది. కొత్త ఏడాదిని టీమిండియా టీ20లతో ఆరంభించనుంది. బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమ్ఇండియాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. లసిత్ మలింగ సారథ్యంలోని శ్రీలంక క్రికెట్ టీమ్ గురువారమే భారత్ చేరుకుంది.
శుక్రవారం కోచ్ల పర్యవేక్షణలో
శుక్రవారం కోచ్ల పర్యవేక్షణలో కొంతమంది ఆటగాళ్లు నెట్ప్రాక్టీస్లో పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత పునరాగమనం చేసిన బుమ్రా బౌలింగ్ సాధన చేశాడు. మహ్మద్ షమీ, దీపక్ చాహర్ జట్టులో లేకపోవడంతో బుమ్రాతో కలిసి నవదీప్ సైనీ పేస్ విభాగంలో సత్తాచాటేందుకు ఎదురుచూస్తున్నాడు.


Click it and Unblock the Notifications
