బంగ్లా బోర్డు సంచలన నిర్ణయం
దీంతో అతడు బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హాసన్ మాట్లాడుతూ "కనీసం రెండేళ్లపాటు విదేశాల్లో జరిగే టీ20 లీగ్లకు అందుబాటులో ఉండొద్దని ముస్తాఫిజుర్కు చెప్పాను" అని అన్నారు.
లీగ్లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు
"ఈ లీగ్లు ఆడటం వల్ల అతడు గాయాల పాలవుతున్నాడు. దీంతో బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని మేం సీరియస్గా తీసుకున్నాం. విదేశీ లీగ్ల్లో ఆడి గాయాలపాలై స్వదేశానికి వచ్చి బోర్డు ఫిజియోల సమక్షంలో కోలుకుంటున్నాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ విదేశాలకు వెళ్లి లీగ్లు ఆడి వచ్చి గాయపడుతున్నాడు" అని తెలిపారు.
ముస్తాఫిజుర్ ఎంతో కీలకమైన ఆటగాడు
"2015లో అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్ దేశం తరఫున ఇప్పటి వరకు కేవలం 10 టెస్టులు, 27 వన్డేలు, 24 టీ20లు మాత్రమే ఆడాడు. బంగ్లాదేశ్ బౌలింగ్ విభాగంలో ముస్తాఫిజుర్ ఎంతో కీలకమైన ఆటగాడు. అలాంటివాడిని మేం కోల్పోవడం వల్ల జట్టుకు ఓటములు ఎక్కువవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని హాజన్ అన్నారు.
ఐపీఎల్లో ఇప్పటివరకు 24 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్
కాగా, 2016 నుంచి ముస్తాఫిజుర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్నాడు. 2016, 17 రెండేళ్ల పాటు సన్రైజర్స్ హైదరబాద్కు ప్రాతినిధ్యం వహించిన అతన్ని ఈ ఏడాది జనవరిలో జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఐపీఎల్లో 24 మ్యాచ్లాడిన ముస్తాఫిజుర్ 24 వికెట్లు దక్కించుకున్నాడు.