
పృథ్వీ షా గాయంతో.. మురళీకి లైన్ క్లియర్
శుక్రవారం ఫీల్డింగ్ చేస్తూ యువ ఓపెనర్ పృథ్వీ షా గాయపడటంతో.. తొలి టెస్టులో ఆడేందుకు మురళీ విజయ్కి లైన్ క్లియరైంది. కానీ.. అతని పేలవ ఫామ్ నేపథ్యంతో.. జట్టులో స్థానం కల్పిచడంపై టీమిండియా సందేహంలో ఉంది. అయితే.. శనివారం తన మెరుపు ఇన్నింగ్స్తో ఫామ్కి తిరుగులేదని సత్తా చాటుకున్నాడు.

4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి
38వ ఓవర్ ముగిసేసరికి 74 పరుగులతో ఉన్న విజయ్.. స్పిన్నర్ జేక్ కార్డర్ కార్డర్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 4, 6, 2, 6, 4 బాది సెంచరీ పూర్తి చేయడం విశేషం. మరో ఓపెనర్ రాహుల్తో అతను తొలి వికెట్కు 109 పరుగులు జోడించాడు. 44వ ఓవర్లో మురళీ విజయ్ ఔటైన తర్వాత మ్యాచ్ ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. భారత్ జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకి ఆలౌటైంది.
27 బంతుల్లో 50 పరుగులు
ఈ ఇన్నింగ్స్లో మురళీ విజయ్ సెంచరీ సాధించాడు. టీ20 మాదిరి దూకుడుగా ఆడిన మురళీ విజయ్ తొలి హాఫ్ సెంచరీ సాధించడానికి 91 బంతులు తీసుకోగా... ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయి ఆడాడు. హాఫ్ సెంచరీని సెంచరీగా మలచడానికి కేవలం 27 బంతులు మాత్రమే తీసుకున్నాడు. మొత్తం 132 బంతులను ఎదుర్కొన్న విజయ్ 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 129 పరుగులు సాధించాడు.

డ్రాగా ఎలా ముగిసిందంటే:
ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 356/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సీఏ ఎలెవన్.. 544 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 358 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇలా ఆస్ట్రేలియా ఎలెవన్తో టీమిండియా డ్రాగా ముగించికుంది.


Click it and Unblock the Notifications












