జెర్సీ ఫొటో వైరల్..
వచ్చే శనివారం నుంచి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడతాయి. ఈ క్రమంలోనే ముంబైకి చెందిన కొందరు కీలక ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్ కోసం ఇక్కడకు చేరుకున్నారు. ఈ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్న జట్టు యాజమాన్యం.. ముంబై జెర్సీని, కొత్త కిట్ను విడుదల చేసింది. ఈ జెర్సీ ఫొటోను ట్విట్టర్లో పంచుకున్న ముంబై ఫ్రాంచైజీ.. 'ముంబైలోని సూర్యుడు, సముద్రం, బ్లూ అండ్ గోల్డ్ కోసం.. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ జెర్సీ' అని పోస్టు చేసింది. ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్.. కొత్తగా ఉన్నా ఈ జెర్సీ కూడా చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.
పూజ ఆడుతుందా?
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ముంబై ఇండియన్స్ చాలా తెలివిగా పాల్గొంది. ఈ జట్టు పేపర్పై చాలా బలంగా కనిపిస్తోంది. అయితే బౌలింగ్ కొంత బలహీనంగా ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరిన పూజ వస్త్రాకర్.. ఈ జట్టు ఆడే తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండటం కూడా కష్టంగా కనిపిస్తోంది. ఆమెను వేలంలో రూ.1.9 కోట్లకు ముంబై కొనుగోలు చేసింది. మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా పూజ ఆడలేదన్న సంగతి తెలిసిందే.
తొలి టైటిల్పై కన్ను..
ఈ జట్టులో హర్మన్ప్రీత్ కౌర్, నాట్ సివర్ బ్రంట్, అమీలియా కెర్, పూజ వస్త్రాకర్, యాస్తికా భాటియా, హేలీ మాథ్యూస్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా తొలి డబ్ల్యూపీఎల్ టైటిల్ తామే నెగ్గాలని ముంబై ఇండియన్స్ యాజమాన్యం భావిస్తోంది. దీని కోసమే జట్టులోని కీలక ఆటగాళ్ల కోసం ఇప్పటికే ట్రైనింగ్ సెషన్ కూడా ఏర్పాటు చేసి సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, యూపీ వారియర్జ్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












