
హైదరాబాద్: మరి కొద్ది రోజుల్లో క్రికెట్ అభిమానుల ముందుకు రాబోతున్న ఐపీఎల్కు ఎనిమిది ఫ్రాంచైజీలు తమ తమ ఏర్పాట్లలో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ అడిగిన ప్రశ్నకు సైతం పూర్తి వివరణ ఇవ్వలేకపోతున్నాయి. ఈ విషయంపై రోహిత్ శర్మ స్పందించి వ్యంగ్యంగా బదులిచ్చాడు. జట్టు యాజమాన్య వైఖరికి చిరాకుతో పేలాడు.
ఐపీఎల్ కోసం జట్టు వివరాలను అప్డేట్ చేశామంటూ ముంబై జట్టు యాజమాన్యం ట్వీట్ చేసింది. జట్టులో కొత్త ముఖాలను చూడబోతున్నావ్. అంటూ ట్వీట్ చేసింది.
బదులిచ్చిన నిర్వహక సంఘం కెప్టెన్ మనం నేరుగా మాట్లాడుకుందామంటూ స్పందించింది.
నేరుగా మెసేజ్ చేస్తామంటున్నారు. నాకైతే ఇప్పటి వరకూ ఏ మెసేజ్ రాలేదు. అని చివర్లో ఓ కార్టూన్ ను ఉపయోగించి హాస్యాస్పదంగా ముగించాడు.
ఒకవేళ ముంబై ఇండియన్స్ జట్టు అనౌన్స్మెంట్లో భాగంగా కూడా ఈ సంభాషణ చేసి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా.