ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ సందర్భంగా టాస్ సమయంలో నాణెం పడే దృశ్యం స్పష్టంగా కనిపించకపోవడం 'టాస్ ఫిక్సింగ్' ఆరోపణలకు దారితీసింది. టెలికాస్ట్ పారదర్శకతపై అభిమానులు తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. ఐపీఎల్ 2026లో వాంఖడే స్టేడియంలో ముంబై, కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు ముందు ఈ వివాదం చెలరేగింది. దీనిపై అనేక అనుమానాలకు తావిచ్చింది.
టాస్ సమయంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాణెం గాల్లోకి ఎగరవేశాడు. కోల్కతా సారథి అజింక్యా రహానే టెయిల్స్ అని స్పష్టంగా చెప్పాడు. నాణెం పడే దృశ్యం ప్రసారంలో స్పష్టంగా కనిపించకపోవడంతో టీవీ వీక్షకులలో గందరగోళం నెలకొంది. నాణెం నేలను తాకగానే కెమెరా యాంగిల్ అకస్మాత్తుగా మారింది. పక్కకు జరిగిపోయింది. కొద్ది క్షణాల్లోనే మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ నాణెం పట్టుకుని ముంబై ఇండియన్స్ టాస్ గెలిచినట్లు ప్రకటించారు.

అది బొరుసా లేక బొమ్మో చూపించకుండానే, కెమెరా యాంగిల్ మారడం అభిమానులలో గందరగోళానికి దారితీసింది. ప్రసారాల్లో సాధారణంగా కనిపించే కాయిన్ జూమ్ షాట్ లేకపోవడం, స్పష్టమైన ధృవీకరణ లోపించడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ సంఘటన క్లిప్లు వైరల్గా మారాయి. అనేక మంది సోషల్ మీడియా యూజర్లు పారదర్శకత గురించి ప్రశ్నిస్తోన్నారు. కెమెరా కట్ టైమ్ కూడా అనుమానాస్పదంగా ఉందని అభిమానులు పేర్కొన్నారు. టాస్ ఫలితాన్ని నిర్ధారించే కీలక దృశ్యం వీక్షకులకు కనిపించకుండా ఉద్దేశపూరకంగానే యాంగిల్ మార్చారని మండిపడ్డారు.
కీలకమైన టాస్ పడే దృశ్యం సరిగ్గా రికార్డు కాకుండా ప్రసారంలో తలెత్తిన సాంకేతిక లోపమే దీనికి కారణమని భావిస్తున్నారు. టాస్ వివాదం మైదానంలోని ఆటను వివాదాస్పదంగా మార్చింది. ఐపీఎల్ ప్రక్రియలు మరింత పారదర్శకతను అభిమానులు కోరుతున్నారు. ఇలాంటి వివాదాలను నివారించడానికి నాణెం క్లోజప్ షాట్లను ప్రదర్శించాలని బీసీసీఐ గతంలోనే బ్రాడ్కాస్టర్లకు ఆదేశించింది. ఈ మ్యాచ్లో ఆ ప్రోటోకాల్ తప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్ వేగవంతం అవుతుండగా, ఆట విశ్వసనీయతను కాపాడటంలో స్పష్టమైన దృశ్యాలు, ప్రసార బాధ్యత ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి చాటిచెప్పింది. ప్రస్తుతం 'టాస్ ఫిక్సింగ్' ఆరోపణలు ధృవీకరించబడకపోయినా, ఆన్లైన్లో ఈ చర్చ కొనసాగుతోంది. ఐపీఎల్లో నాణెం ఎగరవేయడం వంటి సాధారణ సంగతి కూడా పెద్ద చర్చనీయాంశంగా మారుతుందని ఇది రుజువు చేసింది.