హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కోచ్గా కనిపించనున్నాడు. జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ మలింగను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే.
దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగ ఆ జట్టు తరుపున మెత్తం 110 మ్యాచ్లాడి 157 వికెట్లు తీశాడు. వేలంలో మలింగను ముంబై ఇండియన్స్ కూడా కొనుగోలు చేయని సంగతి తెలిసిందే.
అయితే, తమ జట్టుతో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగను బౌలింగ్ కోచ్గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు మంగళవారం ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహిళా జయవర్ధనే సేవలందిస్తుండగా, బౌలింగ్ కోచ్గా షేన్ బాండ్ ఉన్నాడు.
అయినా సరే మలింగను ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్గా నియమించుకుంది. దీంతో త్వరలో మలింగ సహాయక సిబ్బంది జట్టులో చేరనున్నాడు. తనను బౌలింగ్ కోచ్గా నియమించడంపై మలింగ మీడియాతో మాట్లాడుతూ 'ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది' అని పేర్కొన్నాడు.
'ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్గా కొత్త పని చేబట్టపోతున్నాను' అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.