
కోహ్లీకి ప్రస్తుతం ఆట కన్నా విశ్రాంతే కీలకం
కోహ్లీ ప్రస్తుత పేలవ ఫామ్ చూసి.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రితో సహా చాలా మంది క్రికెట్ ప్రముఖులు కోహ్లీ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ ఆట కన్నా విశ్రాంతి తీసుకోవడమే మేలంటూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా భారత మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. మాజీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అయిన ఎంఎస్కే ప్రసాద్.. పీటీఐతో మాట్లాడుతూ.. ప్రస్తుత టఫ్ టైంలో కోహ్లీ తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు. ముందున్న ఆసియా కప్ కోసం సన్నద్ధం కావాలంటే కోహ్లీ రిఫ్రెష్ కావాల్సిన అవసరముందన్నాడు.

రోహిత్ సైతం విరామం తీసుకోవాలి
ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయం ప్రకారం.. 'విరాట్ ఈ టైంలో సరైన విరామం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. త్వరలో జరగబోయే ఆసియా కప్కు ముందు అతను రిఫ్రెష్ అయి అప్ అండ్ రన్నింగ్గా ఉండాలి. కేవలం కోహ్లీ మాత్రమే కాదు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్, టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం ఫామ్లో లేరు. రాబోయే టీ20 ప్రపంచ కప్ సమయంలో భారత లైనప్లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ అత్యంత ప్రాధాన్య ఆటగాళ్లు. వాళ్లు ఆ టోర్నీ టైంకి తప్పకుండా రిఫ్రెష్ అయి ఉండాలి. బ్యాటింగ్ ఆర్డర్ పరంగా.. ఓపెనింగ్ స్లాట్లో శిఖర్ ధావన్ ఉండాలి. ధావన్ ప్రస్తుతం చక్కటి టచ్లో కన్పిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లలో ధావన్ 46.13సగటుతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ధావన్ ఇప్పటివరకు ఆడిన 10మ్యాచ్లలో 369పరుగులు చేశాడు.' అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపాడు.

ఓపెనర్గా శిఖర్ ధావన్.. నాలుగో స్థానంలో రాహుల్
ఎంఎస్కే సూచించిన ప్రకారం.. కోహ్లీ, రోహిత్, ధావన్ జట్టులో ఎంతో అవసరం. వీరిలో ఎవరినీ టీ20 ప్రపంచకప్ జట్టు కోసం వదిలిపెట్టే అవకాశం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం.. చూసుకుంటే ఓపెనింగ్ స్లాట్లో శిఖర్ ధావన్ను ప్రయత్నించాల్సిందే. ఓపెనర్గా శిఖర్కు ఉన్న అనుభవం తోడ్పడుతుంది. ఒకవేళ ఓపెనర్గా ధావన్ విఫలమైతే.. రాహుల్ని ఆ ఆర్డర్లో పంపించవచ్చు. నంబర్ 4 పొజిషన్లో రాహుల్ సాధారణంగా బరిలోకి దిగితే బెటర్. ఎందుకంటే మాంచెస్టర్లో జరిగిన ఓ టీ20 మ్యాచ్లో మిడిలార్డర్లో దిగిన రాహుల్ టీ20ల్లో సెంచరీ కూడా చేశాడు' అని ఎంఎస్కే ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.


Click it and Unblock the Notifications












