|
సాక్షీకి చెప్పులు తొడిగి అందర్నీ ఆశ్చర్యానికి
ఇటీవల తన భార్య సాక్షీతో కలిసి షాపింగ్కి వెళ్లినప్పుడు ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ చెప్పులు కొనుగోలు చేసుకునేందుకు వెళ్లిన ధోనీ భార్య(సాక్షి).. వాటిని పరీక్షించే ప్రయత్నంలో ఇబ్బందిపడుతూ కనిపించింది. దీంతో.. ధోనీ వెంటనే స్పందించి.. స్వయంగా సాక్షీకి చెప్పులు తొడిగి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా విజయవంతమైన కెప్టెన్గా పేరొందిన ధోనీ ఏమాత్రం గర్వం చూపించకుండా.. షాప్లో అందరి ముందూ అలా భార్యకు సాయం చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ల నుంచి తప్పించి
2014లో టెస్టు క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. ఆ తర్వాత వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన.. ఆ తర్వాత ఆసియా కప్లో బ్యాట్తో విఫలమైన ఈ మాజీ కెప్టెన్ని పేలవ ఫామ్ కారణంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ల నుంచి తప్పించారు భారత సెలక్టర్లు. ధోనీ స్థానంలో రిషబ్ పంత్ని ఎంపిక చేశారు. రెండు నెలలుగా అంతర్జాతీయ క్రికెట్కి దూరంగా ఉంటున్న ధోనీ.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కి ఎంపికైతే.. వచ్చే ఏడాది జనవరి 12న మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
ధోనీ టెన్నిస్ పట్టి అందులోనూ కప్
ఫామ్లో లేకపోయినా ధోనీని ఆడించాల్సిందేనంటూ కొందరు పట్టుబడుతున్నా.. ప్రపంచ కప్కు ముందు జట్టులో మార్పులు చేర్పూలు అవసరమంటూ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు సెలక్టర్లతో పాటు కెప్టెన్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ విరామంలోనే ధోనీ టెన్నిస్ పట్టి అందులోనూ కప్ కొట్టేశాడు.