తెరపైకి ధోని కెప్టెన్సీ అంశం
అదే సమయంలో తాజాగా ఇప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంశం తెరపైకి వచ్చింది. దుబాయి వేదికగా ఇటీవల ముగిసిన ఆసియా కప్లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు అతని స్థానంలో రోహిత్ శర్మకి జట్టు పగ్గాలు అప్పగించారు.
|
ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో
టోర్నీలో భాగంగా ఆప్ఘనిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్)లకు జట్టు మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వగా.... ఈ మ్యాచ్లో అనూహ్యంగా ధోనిని కెప్టెన్గా ఎంపిక చేశారు. అలా ధోని చేతికి మళ్లీ పగ్గాలు వెళ్లడంపై బీసీసీఐ పెద్దలు అప్పట్లో పెదవి విరిచినట్లు తాజాగా ఓ కథనం వెలుగులోకి వచ్చింది.
2014లోనే టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని
2014లోనే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని 2017 జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికాడు. దీంతో ధోని వారసుడిగా బీసీసీఐ విరాట్ కోహ్లీని కెప్టెన్గా ఎంపిక చేసింది. అయితే, వన్డే, టీ20ల్లో అతను లేని సమయంలో రోహిత్ శర్మ, టెస్టుల్లో రహానే జట్టు కెప్టెన్గా వ్యవహారిస్తున్నారు.
ధోనీని మినహాయించి జట్టులోని
ఆప్ఘన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లకు విశ్రాంతి ఇవ్వడంతో, ధోనీని మినహాయించి జట్టులోని సీనియర్ క్రికెటర్కి ఎవరికైనా ఆ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ పెద్దలు అప్పట్లో సూచించారంట. అయితే, జట్టు మేనేజ్మెంట్ మాత్రం ధోనివైపే మొగ్గు చూపింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ కాస్త సీరియస్ అయినట్లు తెలిసింది.