MS Dhoni:భారత క్రికెట్ జట్టు గొప్ప కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరు. ఐపీఎల్లో ధోని తన ప్రదర్శనపై చాలా విమర్శలను ఎదుర్కొంటున్నారు. ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ ఎంఎస్ ధోని ఇంకా ఐపీఎల్లో ఆడుతున్నాడు. ఐసీసీ ప్రధాన ట్రోఫీలన్నింటినీ గెలుచుకున్న భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ ఒక్కడే. ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ భారత క్రికెట్ వారసుడిగా అవతరించాడు. విరాట్ కోహ్లీ భారత క్రికెట్లో ఆటగాడిగా, కెప్టెన్గా గొప్ప శిఖరాలను చేరుకున్నాడు. కానీ విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ఎప్పుడూ ఐసీసీ ఈవెంట్ లో టైటిల్ గెలవలేదు. విరాట్ కోహ్లీ ఇకపై ఏ ఫార్మాట్లోనూ భారత జట్టుకు కెప్టెన్ కాకపోయినా.. ఈ లోగా ధోని పాడ్ కాస్ట్ కారణంగా కోహ్లీ మళ్లీ చర్చలోకి వచ్చాడు.
పాడ్కాస్ట్లో ధోని ఏం చెప్పాడు?
ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాడ్ కాస్ట్ లో ధోనిని భారత క్రికెట్ గురించి ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. తన తరంలో ఎంఎస్ ధోని ఎవరితో ఆడాలనుకుంటున్నాడు.. భారతీయ ఆటగాడితోనా లేదా విదేశీ ఆటగాడితోనా అనేది ప్రశ్న. దీనికి ఎంఎస్ ధోని సమాధానమిచ్చారు.

ఎంఎస్ ధోని సమాధానమిస్తూ.. మాజీ లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీతో ఆడాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ధోని ఈ సమాధానం తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోని తన సమాధానంలో విరాట్ కోహ్లీ పేరును కూడా చెప్పలేదు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకరని తెలిసిందే. ధోని నాయకత్వంలో విరాట్ తనను తాను నిరూపించుకున్నాడు. కానీ ఎంఎస్ ధోని కోహ్లీని తన ఉత్తమ ఆటగాళ్ల జాబితాలో చేర్చకపోవడం గమనార్హం.