న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ.. కోహ్లీలకు కొత్త పేర్లు పెట్టిన ధావన్

MS Dhoni, Virat Kohli Now Have New Names, Courtesy Shikhar Dhawan

హైదరాబాద్: ఒకప్పుడు ఉన్న దానికంటే మీడియా పెరిగిపోవడం.. తద్వారా సోషల్ మీడియాల ద్వారా అభిమానులకెప్పుడు దగ్గర్లో ఉంటున్నారు సెలబ్రిటీలు. ఈ కోవలోకే క్రికెటర్లు సైతం వచ్చి చేరారు. తరచూ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో యాక్టివ్‌గా ఉండే.. ధావన్ మరో సారి టీమిండియా సరదా సన్నివేశాలను పోస్టు చేశాడు. అంతేగాక ధోనీ, కోహ్లీలకు తాను పెట్టిన కొత్త పేర్లను వెల్లడించాను.

టీమిండియాలో ఇప్పుడు ఓ ఫ్రెండ్లీ వాతావరణం బాగా కనిపిస్తున్నది. ఫీల్డ్‌లో అయినా బయటైనా ప్లేయర్సంతా బాగా కలిసిపోతున్నారు. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎక్కడుంటే అక్కడ ఓ సందడి వాతావరణం కనిపిస్తుంది. తాజాగా ఇంగ్లాండ్ టూర్ కోసం వెళ్లే సమయంలో విమానంలో టీమ్ మేట్స్‌ను పాటలు పాడుతూ ఎంటర్‌టైన్ చేశాడు.

ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీలకు అతను కొత్త పేర్లు పెట్టాడు. ఈ ఇద్దరూ తన విలువైన రత్నాలని, ఒకరు రామ్ అయితే మరొకరు లఖన్ అంటూ పాట పాడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అటు కోచ్ రవిశాస్త్రి కూడా టీమ్ సపోర్ట్ స్టాప్‌తో దిగిన ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు. విమానం ఎక్కే ముందు తీసిన ఫొటో ఇది.

ఐర్లాండ్‌తోపాటు ఇంగ్లండ్‌లో 81 రోజుల సుదీర్ఘ పర్యటనకు టీమిండియా వెళ్లింది. ఐర్లాండ్‌తో రెండు టీ20లు ఆడనుండగా.. ఇంగ్లండ్‌తో రెండు టీ20, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది. 2014లో చివరిసారి ధోనీ కెప్టెన్సీలో ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియా 1-3తో సిరీస్ ఓడిపోయింది. అయితే ఈసారి మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని, ట్రోఫీతోనే తిరిగి వస్తామని వెళ్లే ముందు కెప్టెన్ కోహ్లి మీడియా సమావేశంలో చెప్పాడు.

Story first published: Sunday, June 24, 2018, 15:10 [IST]
Other articles published on Jun 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X