ధోనీ రిటైర్మెంట్..?
ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ.. తన చుట్టూ బలమైన జట్టును నిర్మించాడు. ధోనీ అంటే సీఎస్కే, సీఎస్కే అంటే ధోనీ అనేలా అభిమానులను సంపాదించాడు. తన అభిమానుల ముందే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాటిచ్చిన ధోనీ.. ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో లేదా ఐపీఎల్ ముగియగానే ఆటకు వీడ్కోలు చెప్పనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఫ్యూచర్ ఏంటి?
ఐపీఎల్కు వీడ్కోలు పలికినంత మాత్రాన ధోనీ ఈ క్రీడకు దూరం అవుతాడని కాదు. అతన్ని భారత టీం మేనేజ్మెంట్లో భాగం చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ఒక సెట్ ఆఫ్ ప్లేయర్స్తో ధోనీ కలిసి పనిచేస్తాడని తెలుస్తోంది. హార్దిక్, పంత్ తదితర ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా భారత జట్టుకు పొట్టి ఫార్మాట్లో కోచ్గా ధోనీని నియమించినా ఆశ్చర్యం లేదు.
|
గతేడాదే అన్నారు
అసలు గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్లోనే ధోనీ రిటైర్ అవుతాడని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్సీని కూడా ధోనీ వదులుకున్నాడు. రవీంద్ర జడేజాను తన వారసుడిగా ప్రకటించాడు. అయితే జడ్డూ కెప్టెన్సీలో జట్టు వరుసగా విఫలమవడంతో మళ్లీ పగ్గాలు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నైతో అభిమానుల ముందే తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడతానని మాటిచ్చాడు. వచ్చే ఏడాది చెన్నైలోనే తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.