IPL 2025: సీఎస్కే కెప్టెన్గా మరోసారి మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ప్రకటించింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో ఈ సీజన్ మొత్తానికి ఎంఎస్ ధోని సారథ్యం వహిస్తారని సీఎస్కే ఫ్రాంచైజీ వెల్లడించింది. ప్రస్తుతం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా తప్పుకున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్ కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి వైదొలగినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోని సీఎస్కేకు సారథ్యం వహిస్తాడు. కేకేఆర్ తో మ్యాచ్ ముందు గురువారం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో గైక్వాడ్ ఆడలేడనే సందేహం ఉంది కానీ చివరి క్షణంలో రుతురాజ్ గైక్వాడ్ ఫిట్గా ఉన్నట్లు ప్రకటించబడింది. రుతురాజ్ గైక్వాడ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చాడు. కానీ గాయం వల్ల రుతురాజ్ మ్యాచ్ లో ఇబ్బంది పడినట్లు కనిపించింది. గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే తరపున ఆడలేడని తెలిసింది.

సీఎస్కే కెప్టెన్ గా ఎంఎస్ ధోని చివరి మ్యాచ్ అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో ఐపీఎల్ 2023 ఫైనల్ సందర్భంగా జరిగింది. రవీంద్ర జడేజా చివరి రెండు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టడంతో సీఎస్కే తన ఐదో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 235 మ్యాచ్ లలో సీఎస్కేకు ఫ్రాంచైజీకి నాయకత్వం వహించాడు. ఐదు ఐపీఎల్ టైటిళ్లను గెలవడంలో తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సీఎస్కే జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుందని తెలిసిందే. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోని సీజన్ మధ్యలో జట్టును నడిపించాల్సి రావడం ఇది రెండో సారి అవుతుంది. ఇంతకు ముందు ఐపీఎల్ 2022లో కూడా ఇలాగే జరిగింది. ఐపీఎల్ 2021 తర్వాత ధోని సీఎస్కే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. దీని తర్వాత రవీంద్ర జడేజాకు కమాండ్ లభించింది. కానీ జడేజా నాయకత్వంలో జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. దీని కారణంగా అతను కెప్టెన్సీని మధ్యలోనే వదిలివేశాడు. ఆ పరిస్థితిలో ధోని మళ్లీ జట్టు కెప్టెన్సీని చేపట్టాడు.