35 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసిన ధోని అభిమానులు
ఈ వన్డేకి ముందు తిరువనంతపురం చేరుకున్న ధోనికి అక్కడి అభిమానులు 35 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి ధోని పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యాచ్ జరిగిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఎదుట ధోని 35అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులతో పంచుకుంది.
అభిమానుల గుండెల్లో తాను ఎల్లప్పుడూ ప్రత్యేకమే
అయితే, ఈ మధ్య కాలంలో ధోని ప్రదర్శన అభిమానులను నిరాశపరుస్తోంది. అయినా సరే ధోని పట్ల అభిమానులకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిది. మరోవైపు అభిమానుల గుండెల్లో తాను ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని తాజాగా మరోసారి నిరూపించుకున్నాడు. ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ధోనికి ఓ చిన్నారి అభిమాని తారసపడ్డాడు.
|
చిన్నారితో సరాదాగా ముచ్చటించిన ధోని
ఈ క్రమంలో ఆ చిన్నారితో ధోని కాసేపు సరదాగా ముచ్చటించాడు. అంతేకాదు ఆ చిన్నారికి షేక్ హ్యాండ్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నవంబర్ 21 నుంచి ఆసీస్తో జరిగే టీ20 సిరిస్లో తలపడనుంది.
నవంబర్ 21 నుంచి ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. ఇప్పటికే టెస్టులకు వీడ్కోలు పలికిన ధోనిని ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు టీ20ల సిరిస్ నుంచి సెలక్టర్లు తప్పించారు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి చోటు కల్పించారు.