
ధోని మరో 197 పరుగులు చేస్తే
సచిన్ను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచేందుకు గాను ధోని మరో 197 పరుగులు చేయాల్సి ఉంది. 2018లో పేలవ ప్రదర్శన కనబర్చిన ధోని, 2019ని మాత్రం అద్భుతంగా ప్రారంభించాడు. గతేడాది 20 ఇన్నింగ్స్లో కేవలం 275 పరుగులు చేసిన ధోని, ఈ ఏడాది ఆడిన మూడు వన్డేల్లోనే 193 పరుగులు చేశాడు.
ఆక్లాండ్లో అడుగుపెట్టిన టీమిండియా
ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్లు గెలిచిన అనంతరం న్యూజిలాండ్తో సిరీస్లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు ఆక్లాండ్లో అడుగుపెట్టింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ సిరీస్లో టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఆక్లాండ్ విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు బయటకు వస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్లో ఉంచింది.

నేపియర్లో తొలి వన్డే
టీమిండియాకు అక్కడి అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్ ఫ్యాన్స్కు ఆటోగ్రాఫ్లు ఇస్తూ కనిపించగా.. విరాట్ కోహ్లీ, అనుష్కకు గట్టిగా అరిచి వెల్కమ్ చెప్పారు. బుధవారం నేపియర్లో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు సోమవారం బయల్దేరి వెళ్లనుంది. నేపియర్ వేదికగా తొలి వన్డే, మౌంట్ మౌంగనయ్లో రెండో, మూడో వన్డేలు, హామిల్టన్, వెల్లింగ్టన్లో చివరి రెండు వన్డేలు జరగనున్నాయి.


Click it and Unblock the Notifications













