న్యూఢిల్లీ: టెస్ట్ మ్యాచ్లకు గుడ్ బై చెప్పిన కారణంగా ప్రస్తుతం ఇంగ్లండ్లో ఆ దేశం జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కి దూరంగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియాలో తనకు దొరికిన ఖాళీ సమయాన్ని ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య సాక్షి, కూతురు జివాలకు తగినంత సమయం కేటాయిస్తూ వారితో సరదాగా గడిపేస్తున్నాడు.
మధ్యమధ్యలో బ్రాండ్ ఎండార్స్మెంట్స్ షూటింగ్స్తో ఇదిగో ఇలా బిజీగా ఉంటున్నాడు. చల్లటి మంచు ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుటుంబంతో టైమ్పాస్ చేస్తున్నాడు. సరదాగా తనకెంతో ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ అక్కడి స్థానిక అభిమానులకు కనువిందు చేస్తున్నాడు. అదే క్రమంలో ఓ బ్రాండ్కు సంబంధించిన షూటింగ్ అడ్వర్టైజ్మెంట్తో బిజీగా కనిపించాడు ధోని.
ధోనికి ఎదురుగా ఉన్న వ్యక్తి ఇంకెవరో కాదు.. ప్రముఖ బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్. ప్రముఖ దర్శకుడు షూజిత్ సర్కార్ డైరెక్ట్ చేస్తున్న ఓ యాడ్ ఫిలింలో బాలీవుడ్ సీనియర్ నటుడు పంకజ్ కపూర్తో ధోని కలిసి నటిస్తున్నాడు. ధోని పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ సప్న భవానితో పాటుగా అతనితో ఉన్న ఫోటో కాస్త వైరల్గా మారింది.
అంతేకాదు.. ధోని సైతం ఈ ఫోటోలో స్టైలిష్ యూత్ ఐకాన్కి కేరాఫ్ అడ్రస్లా కనిపిస్తున్నాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ 15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్లో మన ముందుకు రానున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీలో ఆరు దేశాలు ఆడనున్నాయి. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 18న ఆడనుంది. ఇందులో ప్రధాన ప్రత్యర్థి పాకిస్తాన్తో సెప్టెంబర్ 19న భారత్ ఆడనుంది. ఈ వన్డే మ్యాచ్లో ధోనీ మళ్లీ మైదానంలో మెరవనున్నాడు.