
సత్తా చాటిన తాహిర్
ముంబై ఇండియన్స్ను వణికిస్తూ తొలి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పార్థీవ్ పటేల్(19), రోహిత్ శర్మ(3), జాస్ బట్లర్(38) వికెట్లను సాధించి ముంబైకు షాకిచ్చాడు. ముంబై ఇండియన్స్ మంచి దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తాహీర్ అద్భుతమైన బౌలింగ్లో కీలక ఆటగాళ్లను పెవిలియన్కు చేర్చాడు.

పూణెదే పైచేయి
ఆఖరి ఓవర్ వరకూ నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ మ్యాచ్లో పూణె పైచేయి సాధించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, రహానే (34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు) మెరుపులు తోడవడంతో గురువారం ఇక్కడి ఎమ్సీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య పుణె ఏడు వికెట్లతో ముంబై ఇండియన్స్ను ఓడించింది.

మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్న పూణె
ముంబై నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె మూడు వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 184 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (19 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 35 నాటౌట్), నితీష్ (34) రాణించారు.

తాహిర్ 3, రజత భాటియాకు 2 వికెట్లు
పూణె బౌలర్లలో తాహిర్ 3, రజత భాటియా 2 వికెట్లు తీశారు. స్మితకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఈ ఐపీఎల్ వేలంలో తాహీర్ను ఎవరూ కొనగోలు చేయని సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ ఆరంభానికి కొన్ని రోజులకు ముందు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న తాహిర్ను పూణె జట్టులోకి తీసుకుంది. జట్టు పెట్టుకున్న ఆశల్ని నిజం చేస్తూ తొలి మ్యాచ్లోనే సత్తా చాటాడు తాహిర్.


Click it and Unblock the Notifications











