For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌ జట్టు.. ధోనీకి దక్కని చోటు.. ఓపెనర్‌గా రాహుల్!!

ICC T20 World Cup 2020 : No MS Dhoni in VVS Laxman's Team India Squad For T20 World Cup 2020
MS Dhoni, Shikhar Dhawan big omissions as VVS Laxman names his India squad for ICC T20 World Cup

ముంబై: ఇటీవలి కాలంలో మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ టెస్ట్, వన్డే, టీ20 జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా చేరిపోయారు. ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని నెలల్లో టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. ఈ ప్రపంచకప్‌ కోసం హైదరాబాద్ సొగసరి లక్ష్మణ్‌ తన కలల జట్టును ప్రకటించారు. లక్ష్మణ్ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా ఉన్న సంగతి తెలిసిందే.

ధోనీకి దక్కని చోటు:

ధోనీకి దక్కని చోటు:

ఇండోర్‌లో శ్రీలంకతో రెండో టీ20 మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు లక్ష్మణ్‌ టీ20 ప్రపంచకప్‌నకు తన జట్టును ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ, స్టార్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌కు లక్ష్మణ్‌ తన జట్టులో చోటివ్వలేదు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ తర్వాత ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతడి పునరాగమనంపై ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో రాణించడంపైనే మహీ జట్టుకు ఎంపికవ్వడంపై స్పష్టత రానుంది. అందుకే లక్ష్మణ్‌ చోటివ్వకపోవచ్చు.

స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు:

స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు:

వన్డే ప్రపంచకప్‌ తర్వాత నుంచి శిఖర్‌ ధావన్‌ వరుసగా గాయాల పాలవుతున్నాడు. మరోవైపు ఫామ్‌ కూడా కోల్పోయాడు. పునరాగమనం చేసినప్పటికీ.. మునుపటిలా ధాటిగా ఆడటం లేదు. స్లో బ్యాటింగ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లంక సిరీస్‌లో కూడా ప్రభావం చూపలేదు. చివరి 12 టీ20 ఇన్నింగ్స్‌లలో 110.56 స్ట్రైక్‌రేట్‌తో 272 పరుగులే చేశాడు. దీంతో ధావన్‌పై లక్ష్మణ్‌ శీతకన్ను వేసాడు.

ఓపెనర్‌గా రాహుల్‌:

ఓపెనర్‌గా రాహుల్‌:

ధోనీ, ధావన్‌ల విషయం పక్కనపెడితే.. లక్ష్మణ్‌ జట్టులోని మిగతా సభ్యుల ఎంపిక ఆశ్చర్యం కలిగించలేదు. రోహిత్ శర్మకు జతగా కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా తీసుకున్నారు. విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, మనీశ్‌ పాండే మిడిల్ భారాన్ని మోయనున్నారు. ఆల్‌రౌండర్‌ల కోటాలో హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజాలకు అవకాశం ఇచ్చారు. పేస్ విభాగంలో మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రాలకు చోటు కల్పించారు. స్పిన్ విభాగంలో యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు చోటిచ్చారు.

లక్ష్మణ్‌ జట్టు:

లక్ష్మణ్‌ జట్టు:

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్), మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌.

Story first published: Thursday, January 9, 2020, 10:40 [IST]
Other articles published on Jan 9, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+