హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ సారథి ధోనీ దుబాయ్ ఒక్కటే కాదు సింగపూర్లో కూడా పాగా వేసేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే మహేంద్ర సింగ్ ధోనీ దుబాయ్లో తన పేరిట క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. ఇప్పుడు దాంతోపాటుగా రెండో క్రికెట్ అకాడమీని సింగపూర్లో ప్రారంభించబోతున్నాడు. ఇందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. సింగపూర్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో ఈ నెల 20న ధోనీ అకాడమీని ప్రారంభించనున్నాడు.
సింగపూర్కు చెందిన ఇద్దరు క్రికెటర్లు చేతన్ సూర్యవంశీ, చమిందా రువాన్, సింగపూర్ మహిళల క్రికెట్ జట్టు సారథి జీకే దివియాతో కలిసి ధోనీ ఈ ప్రాజెక్టు కోసం కలిసి పని చేస్తున్నాడు. 13 దేశాల్లో ధోనీ క్రికెట్ అకాడమీలను ప్రారంభించేందుకు అకాడమియా 7తో ఒప్పందం చేసుకున్నాడు. ఆసియాలో ఆర్క స్పోర్ట్స్తో కలిసి ధోనీ 12 అకాడమీలను ప్రారంభించనున్నాడు.
ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. 'చిన్నారుల ఎదుగుదలలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయి. నాయకత్వ లక్షణాలు, శరీర దృఢత్వం వంటివి క్రీడల ద్వారా అలవడతాయి. ప్రతి చిన్నారి ఔట్ డోర్ గేమ్స్ ఆడాలి. ఎమ్ఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ ద్వారా చిన్నారుల్లో క్రికెట్ ప్రతిభను వెలికితీయడానికే కాకుండా వారు క్రీడల ద్వారా జీవితంలో విజేతగా నిలిచేందుకు దోహదపడుతోంది' అని ధోనీ తెలిపాడు.
ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టులో పాల్గొంటున్న ధోనీ ఇన్ని వ్యవహారాలను ఎలా చక్కబెడుతున్నాడో..
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.