టీ20 కెరీర్ ముగిసిపోయినట్లేనని
ఇదే కారణంతో ఆస్ట్రేలియాతో జరగనున్నటీ20లకి సెలక్లర్లు అతడ్ని పక్కన పెట్టేశారంటూ వార్తలు వినిపించాయి. ఇక ధోనీ కెరీర్ ముగిసినట్లే. టీ20లకు కూడా విరామం ప్రకటించాల్సిందేనంటూ చెప్పుకొచ్చారు. టీమిండియా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని ఎంపిక చేయడంతో.. ధోనీ టీ20 కెరీర్ ఇక ముగిసిపోయినట్లు వచ్చిన వార్తలు బలపడ్డాయి. ధోనీ టీ20 కెరీర్పై వస్తున్న వదంతులపై తాజాగా డ్వేన్ బ్రావో స్పందించాడు.
స్వయంగా నిర్ణయించుకుంటేనే కానీ
ధోనీ లాంటి స్టార్ క్రికెటర్ కెరీర్.. స్వయంగా అతను నిర్ణయించుకుంటేనే కానీ సాధారణంగా ఎవరో నిర్ణయిస్తే జరిగేది కాదు. విమర్శకులు తోచినట్లు మాట్లాడుతూనే ఉంటారు. ఐపీఎల్ 2018కి ముందు ధోనీ గురించి మాట్లాడిన వారందరికీ సీజన్లో బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఆటగాళ్ల స్థాయిని బట్టి.. దాని ప్రభావం ఉంటుంది. కానీ.. ధోనీ ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్న ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ధోని కూడా ఒకడిగా ఉంటాడు. కాబట్టి.. రిటైర్మెంట్పై అతనే ఓ నిర్ణయం తీసుకుంటాడు. అంతేతప్ప.. ఎవరూ అతని టీ20 కెరీర్ని డిసైడ్ చేయలేరు.
టీ10 లీగ్ కూడా భవిష్యత్లో అభివృద్ధి
రస్తుతం అతను ఆడుతున్న టీ10 లీగ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చాడు. ట్వంటీతో పోల్చుకుంటే టీ10లీగ్ చాలా కొత్తది. టీ20లీగ్లో లాగే ఇక్కడ కూడా రాణించేందుకు కష్టపడుతున్నాను. టీ10 లీగ్ కూడా భవిష్యత్లో అభివృద్ధి చెందుతుందనుకుంటున్నాను. ఎందుకంటే సీనియర్ క్రికెటర్లు సైతం ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిలో ఆడటం వల్ల శారీరకంగా అలసిపోయేదేమీ లేదు. అందుకనే మెరుగైన ప్లేయర్లు కూడా ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు' అని చెప్పుకొచ్చాడు.