
ధోనికి కేవలం టీ20లు మాత్రమే
"అప్పుడు ధోనికి కేవలం టీ20లు మాత్రమే మిగులుతాయి. వచ్చే ఐపీఎల్లో ధోని ఆడతాడు. మీరు తెలుసుకోవాల్సింది ఒక్కటే తనకు తానుగా ధోనీ జట్టుకు భారం అవ్వడు. కానీ, అతడు ఐపీఎల్లో అద్భుతంగా ఆడితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది" అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ధోనీ, రిషభ్ పంత్, సంజు శాంసన్ను ఎంపికపై
ధోనీ, రిషభ్ పంత్, సంజు శాంసన్ను ఎంపిక చేసే విషయంలో మిడిలార్డర్లో అనుభవం, ఫామ్ ఎంతో కీలకమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. "ఆటగాడి ఫామ్, అనుభవాన్ని మేం పరిగణనలోకి తీసుకుంటాం. వారు 5-6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఒకవేళ ఐపీఎల్లో ధోనీ బాగా ఆడితే అతడు కూడా రేసులో ఉంటాడు" అని శాస్త్రి చెప్పాడు.

పంత్ని వెనుకేసుకొచ్చిన రవిశాస్త్రి
వికెట్ కీపర్ రిషబ్ పంత్ని రవిశాస్త్రి వెనుకేసుకొచ్చాడు. "పంత్కు కేవలం 21 ఏళ్లు. ఆ వయసులో సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు ఎవరున్నారు? " అని రవిశాస్త్రి ప్రశ్నించాడు. "ప్రతి ఒక్కరూ తప్పిదాలు చేస్తారు. పరిణతి సాధించే కొద్దీ అతడు మెరుగవుతాడు. రాత్రికి రాత్రే సాధ్యం కాదు. పంత్ మ్యాచ్ విజేత అనడంలో సందేహం లేదు. అతడికి ప్రతిభ ఉంది" అని శాస్త్రి అన్నాడు.

నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనపై
అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పిన రవిశాస్త్రి... ఆ దిశగా అతడు కఠినంగా శ్రమిస్తున్నాడని తెలిపాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్ను నాలుగు రోజులకు కుదించాలన్న ఐసీసీ ప్రతిపాదనపై రవిశాస్త్రి స్పందించాడు. ఇదొక మతిలేని చర్యగా రవిశాస్త్రి అభివర్ణించాడు. టెస్టు క్రికెట్ను బ్రతికించుకోవాలంటే టాప్-6 దేశాలు ఎక్కువగా సుదీర్ఘ ఫార్మాట్ ఆడేలా చూసుకోవాలని శాస్త్రి సలహా ఇచ్చాడు.


Click it and Unblock the Notifications












