హైదరాబాద్: ధోనీ కూతురు కావడంతో జీవా సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీగా మారిపోయింది. స్టేడియంలో ఆటలాడుతూ.. ముద్దుముద్దుగా మాట్లాడుతూ.. నాన్నతో కలిసి ఆడుకుంటూ.. జీవా చేస్తున్న పనులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐపీఎల్ సీజన్ మొదలైనప్పటి నుంచి జీవా తరచుగా కనిపిస్తూనే ఉంది. బుధవారం పూణె స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్కు వీడ్కోలు చెప్తున్న ధోనీతో పాటు బుడిబుడి అడుగులేసుకుంటూ తోడుగా నిల్చొంది.
మళ్లీ తర్వాత గురువారం జీవాకు ఆయా అన్నం తినిపిస్తుండగా ఎవరో ఫొటో తీస్తున్నారని ఏయ్ నో ఫొటో అంటూ ఫొటోగ్రాఫర్కు వార్నింగ్ ఇచ్చింది.
Regrann from @msdhoni_addicted - Ziva Baby Saying No Photo ! 😂❤ - #regrann
A post shared by sakshi singh dhoni (@sakshiisingh_r) on
జీవాకి ఓ మహిళ స్పూన్తో అన్నం తినిపిస్తుండగా.. ఎవరో ఫొటో తీయడానికి ప్రయత్నించారు. దీంతో కోపం వచ్చిన జీవా.. నో ఫొటో అంటూ అతడికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బహుశా వాళ్ల అమ్మానాన్న దగ్గర్నుంచి ఈ మాట విని పట్టేసిందేమో.. కానీ చూపుడు వేలు చూపుతూ వార్నింగ్ ఇస్తుండగా.. వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను ధోనీ సతీమణ సాక్షి సింగ్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధోనీ అభిమానులతో పంచుకుంది. కాగా, ధోనీ కెప్టెన్సీలో విజయవంతంగా దూసుకుపోతోన్న చెన్నై జట్టు ఫైనల్స్కు వెళ్లేందుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై పంజాబ్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో కోల్కతా, హైదరాబాద్ మధ్య మ్యాచ్లో గెలిచిన జట్టుతో మే 27న చెన్నై ఫైనల్స్లో పోరాడనుంది.